AP Assembly: పోడియం దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా సస్పెన్షన్.. స్పీకర్ రూలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ ఏకంగా ఎమెల్యేల మధ్య ఘర్షణ వరకు వెళ్లింది పరిస్థితి.. మాపై దాడి చేశారంటే.. లేదు మాపైనే దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.. అయితే, టీడీపీ సభ్యుల తీరు నేపథ్యంలో సభలో రూలింగ్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. స్పీకర్ పోడియం ఎక్కి నిరసన వ్యక్తం చేస్తే ఆటోమేటిక్గా సంబంధిత సభ్యులకు సస్పెన్షన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.. ఇక, సభలో టీడీపీ సభ్యుల తీరు ఆక్షేపణీయం అన్నారు స్పీకర్.. పార్లమెంటు రూల్ 374 ఏ, 2001 ప్రకారం సభ్యులు అందరూ రూల్ పాటించాల్సిందే అన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ప్రతిపాదన పంపిస్తే.. ప్రివిలేజ్ కమిటీకి ఆదేశిస్తాను అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. అయితే, ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని మంత్రి ఆదిమూలపు సురేష్.. స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.
Read Also: Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
కాగా, స్పీకర్తో టీడీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు.. అడ్డుకోవడానికి మేం వెళ్తే.. మమ్మల్ని తోసేశారు.. మాపై దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ దృష్టికి దాడి ఘటనను తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు సుధాకర్బాబు, ఎలిజా.. ముఖ్యమంత్రిని కలిసి తమపై జరిగిన దాడి ఘటనపై వివరించారు.. టీడీపీ ఎమ్మెల్యేల స్పీకర్ పోడియం పైకి దూసుకుని రావటం, ప్లకార్డులను ఆయన ముఖం పై పెట్టడం, చేయి వేయటం వంటి ఘటనలను సీఎం జగన్ కు వివరించారు. మరోవైపు.. ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిననాటి నుంచి ప్రతీరోజు సభ నుంచి ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురవుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!