South Coast Railwayzone: విశాఖ రైల్వే జోన్ కోసం నయాపైసా ఇవ్వని కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి సంబంధించి విభజన హామీల అమలులో హంగు ఆర్భాటాలే గానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు కేంద్రం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిమిత్తం ఇప్పటి వరకు నయాపైసా ఖర్చు పెట్టలేదు కేంద్రం.సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు కేంద్రం కేటాయింపులు.. నిధుల విడుదల.. ఖర్చుల వివరాలను వెల్లడించింది కేంద్ర రైల్వే శాఖ.
సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ అర్జీకి రిప్లై ఇచ్చింది కేంద్రం. 2020-21 బడ్జెట్టులో విశాఖ జోన్, రాయగఢ డివిజన్ ఏర్పాటు నిమిత్తం రూ. 170 కోట్ల కేటాయింపులు జరిపినట్టు తెలిపింది. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో వరుసగా రూ. 3 కోట్లు, రూ. 40 లక్షలు, రూ. 40 లక్షలు నిధుల విడుదల చేసింది. ఇప్పటి వరకు విశాఖ జోన్, రాయగఢ డివిజన్ నిమిత్తం నయా పైసా ఖర్చు పెట్టలేదని స్పష్టం చేసింది కేంద్రం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్, రాయగఢ డివిజన్ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓఎస్డీని నియమించామని కేంద్ర రైల్వై శాఖ. తెలిపింది.
Also Read
ఇప్పటి వరకు విశాఖ జోన్, రాయగఢ డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్దం కాలేదని స్పష్టం చేసింది కేంద్రం. తెలంగాణలో కాజీపేట కేంద్రంగా ఎలాంటి డివిజన్ ఏర్పాటు ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!