మేం అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్: సోము వీర్రాజు
ఏపీలో వైసీపీ సర్కారుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అన్నవాళ్లు సారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు . మద్యం రేట్లు పెంచి సామాన్యులను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ బాగుంటే రూ.50కే చీప్ లిక్కర్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: అమరావతిలోనే బీజేపీ ఆఫీస్.. స్పష్టం చేసిన సోము వీర్రాజు
మరోవైపు వైసీపీ ప్రభుత్వమే పచ్చి సారా కాస్తోందని సోము వీర్రాజు విమర్శలు చేశారు. బూమ్ బూమ్ బీర్లంట.. పాపం కింగ్ ఫిషర్ బీర్లు ఏమయ్యాయో తెలియదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో జగన్ సంక్షోభం సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో రాజధానిని నిర్మిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆరునూరైనా అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!