Somu Veerraju: అమరావతి కట్టడంలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఫెయిలయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju On TDP YCP Parties Over AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది బీజేపీ లక్ష్యమని.. రాజధానిని కట్టడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. పొత్తులపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధుల్ని తప్పిస్తే.. రాష్ట్ర ఖజానా నుంచి వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా అయినా ఖర్చు చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. పేరుకు బీసీ కార్పొరేషన్ పెట్టారు గానీ.. అందులో నిధులు ఏమీ లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాము బీసీ చైతన్య సభలు నిర్మించబోతున్నామని అన్నారు. అవినాష్ రెడ్డిని సీబీఐ తప్పకుండా అరెస్ట్ చేస్తుందని.. సిబిఐ వాళ్లు తిరుగుతున్నారని.. అది మీరు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.
Peddireddy Ramachandra Reddy: కక్షపూరితంగానే ఆ పని చేశారంటూ.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- BC Reservation Bill: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
- BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
అంతకుముందు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పరిపాలన పూర్తైన సందర్భంగా తాము 13 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. మే 30వ తేదీ నుంచి జూన్ 30 వరకు అందరి ఇళ్ళకు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేశామని.. డోర్ టూ డోర్ వెళ్లి మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ చార్జిషీటు దాఖలు చేసిన సమయంలో అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? సీఎం పరిపాలిస్తున్నాడా లేక నాయకులే పాలిస్తున్నారా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. ఏపీని పరిపాలిస్తుంది, అభివృద్ధి చేస్తుంది మోడీ మాత్రమేనని పేర్కొన్నారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయించారని.. పోర్టులు, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!