Somu Veerraju: అమరావతి కట్టడంలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఫెయిలయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju On TDP YCP Parties Over AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది బీజేపీ లక్ష్యమని.. రాజధానిని కట్టడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. పొత్తులపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధుల్ని తప్పిస్తే.. రాష్ట్ర ఖజానా నుంచి వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా అయినా ఖర్చు చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. పేరుకు బీసీ కార్పొరేషన్ పెట్టారు గానీ.. అందులో నిధులు ఏమీ లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాము బీసీ చైతన్య సభలు నిర్మించబోతున్నామని అన్నారు. అవినాష్ రెడ్డిని సీబీఐ తప్పకుండా అరెస్ట్ చేస్తుందని.. సిబిఐ వాళ్లు తిరుగుతున్నారని.. అది మీరు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.
Peddireddy Ramachandra Reddy: కక్షపూరితంగానే ఆ పని చేశారంటూ.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అంతకుముందు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పరిపాలన పూర్తైన సందర్భంగా తాము 13 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. మే 30వ తేదీ నుంచి జూన్ 30 వరకు అందరి ఇళ్ళకు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేశామని.. డోర్ టూ డోర్ వెళ్లి మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ చార్జిషీటు దాఖలు చేసిన సమయంలో అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? సీఎం పరిపాలిస్తున్నాడా లేక నాయకులే పాలిస్తున్నారా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. ఏపీని పరిపాలిస్తుంది, అభివృద్ధి చేస్తుంది మోడీ మాత్రమేనని పేర్కొన్నారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయించారని.. పోర్టులు, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!