Somu Veerraju: అమరావతి కట్టడంలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఫెయిలయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju On TDP YCP Parties Over AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది బీజేపీ లక్ష్యమని.. రాజధానిని కట్టడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. పొత్తులపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధుల్ని తప్పిస్తే.. రాష్ట్ర ఖజానా నుంచి వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా అయినా ఖర్చు చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. పేరుకు బీసీ కార్పొరేషన్ పెట్టారు గానీ.. అందులో నిధులు ఏమీ లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాము బీసీ చైతన్య సభలు నిర్మించబోతున్నామని అన్నారు. అవినాష్ రెడ్డిని సీబీఐ తప్పకుండా అరెస్ట్ చేస్తుందని.. సిబిఐ వాళ్లు తిరుగుతున్నారని.. అది మీరు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.
Peddireddy Ramachandra Reddy: కక్షపూరితంగానే ఆ పని చేశారంటూ.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- Ambati Rambabu: 'ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు'.. డిప్యూటీ సీఎం పవన్పై మాజీమంత్రి అంబటి ఫైర్
అంతకుముందు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పరిపాలన పూర్తైన సందర్భంగా తాము 13 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. మే 30వ తేదీ నుంచి జూన్ 30 వరకు అందరి ఇళ్ళకు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేశామని.. డోర్ టూ డోర్ వెళ్లి మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ చార్జిషీటు దాఖలు చేసిన సమయంలో అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? సీఎం పరిపాలిస్తున్నాడా లేక నాయకులే పాలిస్తున్నారా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. ఏపీని పరిపాలిస్తుంది, అభివృద్ధి చేస్తుంది మోడీ మాత్రమేనని పేర్కొన్నారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయించారని.. పోర్టులు, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య
తాజావార్తలు
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
-
Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
-
MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
-
India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!