Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సోమువీర్రాజు.. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి..? అని మండిపడ్డారు.. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం.. ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి..? అంటూ నిలదీశారు.. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారు.. హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు సోము వీర్రాజు.
Read Also: Cyber Crime: మహిళలే టార్గెట్.. రోజుకు రూ.5 కోట్ల పైనే దోచేశాడు..!
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
కాగా, గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్వాకంతో రెండు మతాలకు చెందిన వారి మధ్య చిచ్చుపెట్టేలా తయారైంది పరిస్థితి.. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా వీధులకు బోర్డులు ఏర్పాటు చేసేందుకు రాజమండ్రికి చెందిన ఓ కంపెనీకి కాంట్రాక్టు తీసుకుంది.. కనీస సిబ్బంది పర్యవేక్షణ లేకుండానే గుంటూరులో ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చిన పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయించారు అధికారులు.. అయితే, బోర్డులు చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మున్సిపల్ అధికారుల చర్యలు ఉండటంతో అభ్యంతరం తెలుపుతున్నారు.. ఇక, బోర్డుల వ్యవహారంలో సీరియస్ గా స్పందించిన కార్పొరేషన్ పాలకవర్గం.. వెంటనే బోర్డులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. వివాదాస్పద బోర్డులను తొలగిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!