Somu Veerraju: చాగంటి కోటేశ్వరరావు ఎలాంటి అవార్డుకైనా అర్హులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏలూరులోని బీసీ చైతన్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చాగంటి అద్భుతమైన జ్ఞాన భాండాగారం అని సోము వీర్రాజు కీర్తించారు. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని సోము వీర్రాజు విమర్శించారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మరోవైపు కుటుంబ రాజకీయాలకు బీసీలు ఎంత కాలం బలి కావాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.10వేల కోట్ల కాంటాక్టులు బీసీ కార్పొరేషన్లకు అందిస్తామన్నారు. 3వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమం బీసీ కార్పోరేషన్ల ద్వారా చేపడతామన్నారు. వీవర్స్ కార్పోరేషన్ ద్వారా స్కూల్ యూనిఫాంలు అందించే కార్పొరేషన్ల ద్వారా అందిస్తామని సోము వీర్రాజు తెలిపారు.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
Read Also: Kishan Reddy: భిన్నకళలు, సంస్కృతిని కాపాడుకుందాం
అటు చాగంటికి గురజాడ పురస్కారం ప్రకటించడంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. గురజాడ గారి పురస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం సముచితం అని జీవీఎల్ ట్వీట్ చేశారు. గురజాడ అభ్యుదయ భావాలు ఆ సమయంలో ఎంత ముఖ్యమో.. చాగంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఈ సమయంలో ప్రజలకు అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రపంచం మెచ్చుకునే మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే హేతువాదులు సిగ్గుపడాలని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురజాడ గారి పురస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఇవ్వటం సముచితం. గురజాడ గారి అభ్యుదయ భావాలు ఆ సమయంలో
ఎంత ముఖ్యమో ఈరోజు చాగంటి గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు అంతే ముఖ్యం. ప్రపంచం మెచ్చుకునే మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే హేతువాదులు సిగ్గుపడాలి. @BJP4Andhra— GVL Narasimha Rao (@GVLNRAO) November 27, 2022
తాజావార్తలు
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?