Somu Veerraju: చాగంటి కోటేశ్వరరావు ఎలాంటి అవార్డుకైనా అర్హులే
Somu Veerraju: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏలూరులోని బీసీ చైతన్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చాగంటి అద్భుతమైన జ్ఞాన భాండాగారం అని సోము వీర్రాజు కీర్తించారు. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని సోము వీర్రాజు విమర్శించారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మరోవైపు కుటుంబ రాజకీయాలకు బీసీలు ఎంత కాలం బలి కావాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.10వేల కోట్ల కాంటాక్టులు బీసీ కార్పొరేషన్లకు అందిస్తామన్నారు. 3వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమం బీసీ కార్పోరేషన్ల ద్వారా చేపడతామన్నారు. వీవర్స్ కార్పోరేషన్ ద్వారా స్కూల్ యూనిఫాంలు అందించే కార్పొరేషన్ల ద్వారా అందిస్తామని సోము వీర్రాజు తెలిపారు.
Also Read
- Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
Read Also: Kishan Reddy: భిన్నకళలు, సంస్కృతిని కాపాడుకుందాం
అటు చాగంటికి గురజాడ పురస్కారం ప్రకటించడంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. గురజాడ గారి పురస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం సముచితం అని జీవీఎల్ ట్వీట్ చేశారు. గురజాడ అభ్యుదయ భావాలు ఆ సమయంలో ఎంత ముఖ్యమో.. చాగంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఈ సమయంలో ప్రజలకు అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రపంచం మెచ్చుకునే మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే హేతువాదులు సిగ్గుపడాలని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురజాడ గారి పురస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఇవ్వటం సముచితం. గురజాడ గారి అభ్యుదయ భావాలు ఆ సమయంలో
ఎంత ముఖ్యమో ఈరోజు చాగంటి గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు అంతే ముఖ్యం. ప్రపంచం మెచ్చుకునే మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే హేతువాదులు సిగ్గుపడాలి. @BJP4Andhra— GVL Narasimha Rao (@GVLNRAO) November 27, 2022
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!