Somireddy Chandramohan Reddy: వాళ్లు ఆఫ్రికాతో పోలుస్తారు.. మేం శ్రీలంకతో పోలిస్తే బుకాయిస్తారు
Somireddy Chandramohan Reddy: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. జగన్ పాలనలో పంటలపై పెట్టుబడితో పాటు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. హెక్టార్ పత్తికి రూ. 15 వేలు, అరటికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 15 వేల పరిహారం అందించి ఆదుకున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇచ్చామని సోమిరెడ్డి వివరించారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం విపత్తు సమయంలో ఆదుకోవాల్సి ఉండగా పూర్తిగా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
Read Also: 108 Services: ఏపీలో పనిచేయని 108 సర్వీస్.. మరి ఏ నంబర్కు కాల్ చేయాలి?
వైసీపీ ప్రభుత్వం విపత్తుల సాయాన్ని అరకొరగా అందించి చేతులు దులుపుకుంటోందని సోమిరెడ్డి మండిపడ్డారు. గతంలో పనిచేసిన మంత్రి కన్నబాబు వ్యవసాయశాఖను సగం మూసేశారని… కాకాని గోవర్ధన్రెడ్డి వచ్చాక పూర్తిగా మూసేశారని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ఆక్వా రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. తాము మూడు రాజధానుల విషయాన్ని అడిగితే వారు ఆఫ్రికాతో పోలుస్తారని.. తాము ఏపీని శ్రీలంకతో పోలిస్తే మాత్రం బుకాయిస్తారని కౌంటర్ ఇచ్చారు. గత మూడేళ్లలో రైతులకు ఎకరానికి 12 వేల నుంచి 15 వేలకు పెట్టుబడి ఖర్చు పెరిగిందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా అని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Sai Pallavi: నాలుగేళ్ల వివాదంపై సాయి పల్లవి ఎమోషనల్ క్లారిటీ..!
-
Gujarat Titans Record: ముంబై చేతిలో ఘోర ఓటమి.. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డు.!
-
Hardik Pandya: టైమ్అవుట్ సమయంలో తల తిరిగింది.. హార్దిక్ పాండ్య సంచలన వ్యాఖ్యలు!
-
Stock Market: శాంతి చర్చలపై ఆశలు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
-
AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
ట్రెండింగ్
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!