Somireddy Chandramohan Reddy: వాళ్లు ఆఫ్రికాతో పోలుస్తారు.. మేం శ్రీలంకతో పోలిస్తే బుకాయిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. జగన్ పాలనలో పంటలపై పెట్టుబడితో పాటు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. హెక్టార్ పత్తికి రూ. 15 వేలు, అరటికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 15 వేల పరిహారం అందించి ఆదుకున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇచ్చామని సోమిరెడ్డి వివరించారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం విపత్తు సమయంలో ఆదుకోవాల్సి ఉండగా పూర్తిగా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
Read Also: 108 Services: ఏపీలో పనిచేయని 108 సర్వీస్.. మరి ఏ నంబర్కు కాల్ చేయాలి?
Also Read
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
వైసీపీ ప్రభుత్వం విపత్తుల సాయాన్ని అరకొరగా అందించి చేతులు దులుపుకుంటోందని సోమిరెడ్డి మండిపడ్డారు. గతంలో పనిచేసిన మంత్రి కన్నబాబు వ్యవసాయశాఖను సగం మూసేశారని… కాకాని గోవర్ధన్రెడ్డి వచ్చాక పూర్తిగా మూసేశారని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ఆక్వా రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. తాము మూడు రాజధానుల విషయాన్ని అడిగితే వారు ఆఫ్రికాతో పోలుస్తారని.. తాము ఏపీని శ్రీలంకతో పోలిస్తే మాత్రం బుకాయిస్తారని కౌంటర్ ఇచ్చారు. గత మూడేళ్లలో రైతులకు ఎకరానికి 12 వేల నుంచి 15 వేలకు పెట్టుబడి ఖర్చు పెరిగిందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా అని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!