Shobha Karandlaje: వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు మరెన్నో ఇతర దేశాలకు ఎగుమతి చేశాం. ఎన్నో లక్షలమందిని కాపాడాం. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 120 కోట్ల రూపాయలు కేటాయించాం అన్నారు కేంద్రమంత్రి. ఇక్కడ వైద్య సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశంలో ఆరు ఎయిమ్స్ ఆసుపత్రుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చామన్నారు. త్వరలోనే ఈ ఆసుపత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందన్నారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ఈ కార్యక్రమంలో ఎన్ వై కె నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నీరజ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్, ఆర్డీఓ మధుసూదన్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ రాజగోపాల్, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 195.19 కోట్ల టీకా డోసులు వేశారు. 12-14 ఏళ్ల వయసు పిల్లల్లో ఇప్పటి వరకు ఇచ్చిన మొదటి డోసు టీకాలు 3.51 కోట్లు. ప్రస్తుత యాక్టివ్ కేసులు 47,995. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ఆందోళనకరంగా మారింది. మంగళవారం 6594 కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి. ఇందులో 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,792 మంది మరణించారు. కాగా, కొత్తగా 15 మంది కరోనాకు బలవగా, 5718 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!