Shobha Karandlaje: వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు మరెన్నో ఇతర దేశాలకు ఎగుమతి చేశాం. ఎన్నో లక్షలమందిని కాపాడాం. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 120 కోట్ల రూపాయలు కేటాయించాం అన్నారు కేంద్రమంత్రి. ఇక్కడ వైద్య సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశంలో ఆరు ఎయిమ్స్ ఆసుపత్రుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చామన్నారు. త్వరలోనే ఈ ఆసుపత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందన్నారు.
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ఈ కార్యక్రమంలో ఎన్ వై కె నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నీరజ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్, ఆర్డీఓ మధుసూదన్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ రాజగోపాల్, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 195.19 కోట్ల టీకా డోసులు వేశారు. 12-14 ఏళ్ల వయసు పిల్లల్లో ఇప్పటి వరకు ఇచ్చిన మొదటి డోసు టీకాలు 3.51 కోట్లు. ప్రస్తుత యాక్టివ్ కేసులు 47,995. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ఆందోళనకరంగా మారింది. మంగళవారం 6594 కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి. ఇందులో 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,792 మంది మరణించారు. కాగా, కొత్తగా 15 మంది కరోనాకు బలవగా, 5718 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!