Sand Mafia : గోదావరితీరంలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇసుక ఎప్పుడూ డిమాండ్ వున్న వస్తువు. కొంతమంది నేతలు ఇసుక నుంచి కూడా కరెన్సీ పిండేస్తారు. తూర్పు గోదావరిలో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సబ్ కాంట్రాక్ట్ లు పేరుతో దోచేస్తున్నారు. అనుమతి లేకుండా కొన్ని చోట్ల, నిబంధనలకు విరుద్ధంగా ఇంకొన్నిచోట్ల అడ్డంగా తవ్వేస్తున్నారు. జిల్లాలో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ ఛోటా నేతలు.. సబ్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందినకాడికి తవ్వుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. బోట్స్మన్ సొసైటీలైనా, ఓపెన్ ర్యాంపులైనా… వెనక రాజకీయ నాయకుల హస్తం ఉంటోంది. లారీకి 500 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులు కొన్ని ర్యాంపుల్లో చక్రం తిప్పుతుంటే,~ జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు వెనుక ఉండి కథ నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతి లేకపోయినా… గోదావరి తీరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయి. రాజమండ్రి రూరల్ వెంకటనగరంలోని పట్టా భూముల్లో ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. గోదావరి లంక భూముల్లో ఎక్కడ చూసినా ఇసుకాసురులు పెట్టిన గోతులే కనిపిస్తాయి. ఇక సీతానగరం మండలం కాటవరం, వంగలపూడిలో అక్రమాలకు అంతే లేదు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
అటు కోనసీమలోనూ.. ఇటు అఖండ గోదావరిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కోనసీమలో పలు ర్యాంపులకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అనుమతి ఇవ్వలేదు. అయినా అక్రమంగా తవ్వేస్తున్నారు. కోనసీమలోని కొన్ని మండలాల్లో అనుమతి లేకుండానే తవ్వుకుపోతున్నారు. లారీ నెంబర్లతో గోల్మాల్ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇటు వెంకటనగరం నుంచి కాతేరు వరకూ ఉన్న ఏటిగట్టు ఇప్పటికే ధ్వంసం అయింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదారివరిలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై దర్యాప్తు జరిపితే చాలా పెద్ద తలకాయలే పేర్లు బయటకు వస్తాయని అంటున్నారు స్థానికులు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!