Sake Sailajanath: అప్పుడు జై కొట్టిన జగన్.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sake Sailajanath Demands YS Jagan To Declare Amaravati As AP Capital: చంద్రబాబు తన హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు జై కొట్టిన సీఎం జగన్.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. తల తిక్క వ్యవహారాలను ప్రభుత్వం మానుకోవాలని, రాజధాని విషయంలో చేతకాని విధానాలను విడనాడాలని కోరారు. ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైకా రాష్ట్రం ఏమీ మాత్రమేనన్నారు. ఏపీ మంత్రులు తగ్గేదేలే అని బీరాలు పోతున్నారని.. ఇదంతా ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కోరారు. రాష్ట్ర రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలనేదే కాంగ్రెస్ విధానమన్నారు.
‘‘అప్పుడు అమరావతిని రాజధానికి చంద్రబాబు ప్రకటిస్తే జగన్ మద్దతు ఇచ్చారు. ఈలోపు చంద్రబాబుతో ఏం గొడవ వచ్చిందో జగన్ చెప్పాలి’’ అని సాకే శైలజానాథ్ అడిగారు. అమరావతిని ప్రకటించినప్పుడు రాయలసీమ వాసులుగా తమకూ అప్పుడు ఇబ్బంది కలిగిందని.. అయితే ఏపీ ప్రజల మేలు కోరి తాము అమరావతికి అండగా నిలిచామని అన్నారు. సీఎంగా జగన్ ప్రజల్లో, రోడ్ల మీద తిరిగితే.. వాస్తవాలు తెలుస్తాయన్నారు. శ్రీభాగ్ ఒప్పందంపై జగన్కు కనీస అవగాహన లేదని.. అసలు రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్కే మంచిదని.. జగన్ తన ఆలోచనా విధానాలను, మొండి పట్టుదలను వీడాలని కోరారు. మాట తప్పనన్న జగన్.. అమరావతి విషయంలో అన్నీ అబద్దాలే చెప్తున్నారన్నారు. న్యాయ రాజధాని, శాసన రాజధాని, పాలన రాజధాని అనేది ప్రజల మధ్య విద్వేషాల కోసమేనన్నారు. జగన్ రాజకీయ డ్రామాలు ఆపి, అమరావతిని తక్షణమే అభివృద్ధి చేయాలని నిలదీశారు.
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
జగన్ వైఫల్యాలను విమర్శిస్తే దాడులు చేస్తారా..? పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయిస్తారా..? అంటూ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చంపేసి, మూడు రాజధానులు అనడం సహేతుకమా..? అని ప్రశ్నించారు. పేర్లు పెట్టడం వేరు, పనులు పూర్తి చేయడం వేరని తెలిపారు. ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు ఉండటం మన దురదృష్టమన్నారు. అటు బీజేపీ ప్రభుత్వం కుల, మత విద్వేషాలను రెచ్చ గొడుతోందని ఆగ్రహించారు. మోదీ, జగన్ నిరంకుశ పాలనను సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. వీటిని ఎదుర్కునేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని, ఆ యాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. అందరినీ సంఘటితం చేసే యాత్ర అని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా ఒక్క రాహుల్ గాందీకే ఉందని శైలజానాథ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!