Sajjala Ramakrishna Reddy: వరదల్లోనూ చంద్రబాబు ఫోటో విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy comments on chandrababu: వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అంటూ ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని.. చంద్రబాబు మురికి రాజకీయానికి గురువారం నాటి ఘటనే సాక్ష్యమన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణ సహాయక చర్యలు చేపట్టిన దాఖలాలే లేవని సజ్జల విమర్శించారు.
Read Also: South Central Railway: ప్రయాణికులకు గమనిక.. పలు మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లు
Also Read
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ప్రస్తుతం వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఆసాంతం పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఏ ఒక్కరితో కూడా చెప్పించలేకపోయారని సజ్జల అన్నారు. సాయం అందలేదనే మాట ఒక్కరి నోటి నుంచి కూడా రాని పరిస్థితి కనిపించిందన్నారు. 40ఏళ్ల చంద్రబాబు అబద్ధపు రాజకీయ జీవితం ఆఖరి దశకు చేరిందని సజ్జల విమర్శలు చేశారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో పార్టీలకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగిందని.. నిర్దేశిత కాలపరిమితిలో మండల కమిటీలు వేసుకోవాలని సీఎం జగన్ సూచించారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలతో నేరుగా జగన్ మాట్లాడతారన్నారు. గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేరవేస్తున్నామన్నారు. తమప్రభుత్వంలో లంచం అనేదే లేకుండా నేరుగా లబ్దిదారులకు డీబీటీల ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని తెలిపారు. గతంలో ఏం జరిగింది.. ఈ మూడేళ్లల్లో ఏం జరిగిందనే అంశాన్ని బేరీజు వేసుకుంటే ప్రతి ఒక్కరూ జగన్ వైపే వస్తారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న మంచిని ప్రజల వద్దకు తీసుకెళ్లేలా సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నామన్నారు. గత ప్రభుత్వం గ్రాఫిక్స్, మోసం ద్వారా మభ్య పెట్టిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ప్రతిపక్షం బురద జల్లుతోందని మండిపడ్డారు. బటన్ నొక్కగానే డబ్బులు ఖాతాల్లోకి వెళ్తున్నాయని.. ఈ తరహాలో బటన్ నొక్కే విధానం గతంలో ఎన్నడూ లేదన్నారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!