Sajjala: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. బాబు అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఓ ప్రభుత్వ విభాగంలో కొద్ది మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు వచ్చాయని.. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సజ్జల తెలిపారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు. పంచాయతీరాజ్ డిపార్టుమెంట్లోనూ పొరుగు సేవల సిబ్బంది తొలగించారన్న అంశంపైనా విచారణ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులెవరినీ తొలగించే ప్రసక్తే లేదన్నారు. రాయలసీమకు వైఎస్ఆర్ సహా జగన్ ఏం చేశారనే విషయం అక్కడి ప్రజలకు తెలుసు అని.. వచ్చే ఎన్నికల్లో వాళ్లే సమాధానం చెప్తారన్నారు.
ఎడారి లాంటి పులివెందులలో నీరు నింపి బోటింగ్ కూడా సీఎం జగన్ ప్రారంభించారని సజ్జల వెల్లడించారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి వరద జలాలు ఇవ్వాలని కాలువల వెడల్పు చేపట్టారని.. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు లిఫ్ట్ చేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు మూడు టీఎంసీలు లిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఎన్జీటీలో కేసు వేసి చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. హంద్రీనీవా, వెలిగొండ పనులను సీఎం జగన్ పూర్తి చేస్తున్నారని.. కుప్పం బ్రాంచి కెనాల్ను కూడా చంద్రబాబు పూర్తి చేయకపోతే వైఎస్ జగన్ పూర్తి చేశారన్నారు. ఎన్నడూ లేని విధంగా ఐదు మెడికల్ కళాశాలు రాయలసీమకు వస్తున్నాయని సజ్జల చెప్పారు. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లు కూడా రాయలసీమకు వస్తున్నాయని చెప్పారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
Read Also: Nadendla Manohar: పుంగనూరు దాడిని ఖండిస్తున్నాం.. రైతు సభ నిర్వహణ నేరమా?
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారకుడు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదని.. పోలవరం పూర్తి చేసేది లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందన్నారు. ఇప్పటికీ రాజధాని, హైకోర్టు అమరావతిలోనే ఉన్నాయని.. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది తమ విధానం అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు రావడం ఖాయమని సజ్జల స్పష్టం చేశారు. న్యాయ పరిశీలన చేసి పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు శాసన సభలో పెడతామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్లో చంద్రబాబు, లోకేష్ పాత్ర లేకుండా అవకతవకలు జరిగి ఉండవని.. వాళ్ల అక్రమాలపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. అవకతవకల్లో ఎవరెవరు ఉన్నారో ఈడీ దర్యాప్తు ఆధారంగా అందరిపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!