Sailajanath: జంగారెడ్డిగూడెం ఘటనపై హెచ్చార్సీకి కంప్లైంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జంగారెడ్డి గూడెం ఘటన అటు విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశామన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజనాథ్. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తాం అన్నారు. సీఎం జగన్ ప్యాలెస్సులో కూర్చుంటే పాలన సాగదు. నాటుసారా తాగి అనేకమంది చనిపోతున్నారు. అధికార యంత్రాంగం వత్తిళ్లకు భయపడి సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారు. జ్యూడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు శైలజానాథ్. వైసీపీ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం చెందింది. ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
జంగారెడ్డి గూడెంలో ఒకరి తరువాత ఒకరిగా రోజుల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మరణించినవారి సంఖ్య 19కి చేరింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి బుధవారం తుదిశ్వాస విడిచారు. దాదాపుగా వారం రోజుల్లోనే ఇంత మంది చనిపోవడంతో సహజంగానే వీటిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. సారా తాగడం వల్లే ఈ మరణాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారపార్టీలో మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు ఇవి సహజ మరణాలే అని బల్లగుద్దుతుండడం విమర్శలకు గురవుతోంది. ప్రతిపక్షాలు శవరాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి అలా ఉంచితే, దీనిపై స్పందించి, వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.
గడిచిన నాలుగైదు రోజుల్లో జంగారెడ్డిగూడెంలో 243 లీటర్ల సారా, 18,300 లీటర్ల బెల్లం ఊట, 63,048 కిలోల నల్లబెల్లంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెక్కల్ని బట్టి చూస్తే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో సారా కాయడమన్నది చిన్నసైజు పరిశ్రమగా సాగుతోందంటున్నారు. ఇప్పటికైనా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాలపై ప్రతిపక్షాలు కోరుతున్న విధంగా తక్షణం న్యాయ విచారణ జరిపించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. నష్టపరిహారం చెల్లించాలి. మద్యంలో సారాను కల్తీ చేసి అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలపై తక్షణం దృష్టి సారించాలి.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!