Rk Roja: పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండెపగిలి చచ్చిపోతాడేమో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rk Roja: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ.. తన అభిమాన సంఘాలనే కాకుండా ప్రజలను కూడా తనదైన మాటతీరుతో ఆకట్టుకోవడమే కాకుండా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక నిన్నటికి నిన్న గాజువాకలో జరిగిన సభలో జగన్ పై పవన్ మరోసారి దుమ్మెత్తిపోశారు. ” ఆస్తులు అమ్ముకునేందుకా ప్రజలు మిమ్మల్ని సీఎంగా ఎన్నుకున్నది. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తాను.. “అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా భూమి పేలిపోవాలి.. అందులో రుషికొండ మునిగిపోవాలి.. అందులో జగన్ సమాధి కావాలి అని ఆవేశంగా మాట్లాడారు. ఇక ఈ మాటలకు మినిస్టర్ రోజా కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై రోజా తనదైన రీతిలో చెలరేగారు. పవన్ కళ్యాణ్ కు పిచ్చి పట్టిందని ఎర్రగడ్డ లో చేర్పించాలని తెలిపారు. జగన్ ను చూసి పవన్ కుళ్ళుకుంటున్నాడని.. అందుకే తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.
Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
” పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే.. జగన్ గారి పై ఆయన కడుపుమంట, ఆయన జెలసీ ఎంత పెరిగిపోతుందో స్పష్టంగా అర్ధమవుతుంది. తనకన్నా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు.. రోజురోజుకు ప్రజల్లో అభిమానం పెరిగిపోతుంది. దేశంలో ఆయన క్రేజ్ ఎంత పెరుగుతుందో చూసి సహించలేని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే.. భూమి పేలిపోవాలి.. అందులో రుషికొండ మునిగిపోవాలి.. అందులో జగన్ సమాధి కావాలి అని మాట్లాడు అంటే.. ఈయన కడుపుమంటతోనే గుండెలు పగిలేలా అరిచి అరిచి చచ్చిపోతాడేమో.. అని భయమేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆరోగ్యశ్రీ కింద ఈ పవన్ కళ్యాణ్ ను కడుపుమంటల కళ్యాణ్ అనే ప్రోసిజర్ కింద ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కడుపుమంటను చల్లార్చామని కోరతాం.. అప్పటికి చల్లారాకపోతే హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో జాయిన్ చేయాలనీ కోరుతున్నాం” అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండె పగిలి చచ్చిపోతాడేమోనని భయమేస్తోంది! – రోజా#Roja #PawanKalyan #VarahiVijayaYatra #VarahiVijayaYatraPhase3 #Janasena #JanaSenaPorataYatra #RojaSelvamani #YSRCP #AndhraPradesh #YSRCP #NTVTelugu pic.twitter.com/RPmoLaO5XE
— NTV Telugu (@NtvTeluguLive) August 14, 2023
తాజావార్తలు
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!