Rayapati and Kanna: పుష్కరకాలం వివాదానికి ఫుల్ స్టాప్.. కన్నా, రాయపాటి మధ్య కుదిరిన రాజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేతలు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు… బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య రాజీ కుదిరింది.. 2010లో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం వీరిద్దరూ ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు.. మొత్తంగా పుష్కరకాలంగా నానుతూ వచ్చిన వివాదానికి ఇవాళ ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది… కాగా, 2010లో రాయపాటిపై కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా వేశారు.. ఆ సమయంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం గమనార్హం. అప్పట్లో రాయపాటి గుంటూరు లోక్సభ ఎంపీగా ఉండగా.. కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు.. అయితే, స్థానిక రాజకీయాల నేపథ్యంలోనే రాయపాటిపై పరువు నష్టం దావా వేశారు కన్నా.. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది.. ఇవాళ కోర్టుకు హాజరయ్యారు రాయపాటి, కన్నా… కేసులో విచారణ పూర్తి కావడంతో.. ఇద్దరిని కోర్టుకు రమ్మని న్యాయమూర్తి ఆదేశించడంతో.. కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇద్దర నేతలు హాజరయ్యారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ… అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.. సీనియర్ నేతలు రాజకీయాల్లో ఉన్నవారు భావితరాలకు ఆదర్శంగా ఉండాలని.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తగదు అని ఈ సందర్భంగా కోర్టు సూచించింది.. కోర్టు సూచనతో తాము చేసిన ఆరోపణలను ఉపసంహరించుకున్నారు ఇరువురు నేతలు… రాజీ కోసం సంతకాలు కూడా చేశారు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ. దీంతో రాయపాటి సాంబశివరావుపై కన్నా లక్ష్మీనారాయణ వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టివేసింది కోర్టు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!