Rayapati and Kanna: పుష్కరకాలం వివాదానికి ఫుల్ స్టాప్.. కన్నా, రాయపాటి మధ్య కుదిరిన రాజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేతలు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు… బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య రాజీ కుదిరింది.. 2010లో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం వీరిద్దరూ ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు.. మొత్తంగా పుష్కరకాలంగా నానుతూ వచ్చిన వివాదానికి ఇవాళ ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది… కాగా, 2010లో రాయపాటిపై కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా వేశారు.. ఆ సమయంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం గమనార్హం. అప్పట్లో రాయపాటి గుంటూరు లోక్సభ ఎంపీగా ఉండగా.. కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు.. అయితే, స్థానిక రాజకీయాల నేపథ్యంలోనే రాయపాటిపై పరువు నష్టం దావా వేశారు కన్నా.. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది.. ఇవాళ కోర్టుకు హాజరయ్యారు రాయపాటి, కన్నా… కేసులో విచారణ పూర్తి కావడంతో.. ఇద్దరిని కోర్టుకు రమ్మని న్యాయమూర్తి ఆదేశించడంతో.. కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇద్దర నేతలు హాజరయ్యారు.
Also Read
- CM Convey: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ… అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.. సీనియర్ నేతలు రాజకీయాల్లో ఉన్నవారు భావితరాలకు ఆదర్శంగా ఉండాలని.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తగదు అని ఈ సందర్భంగా కోర్టు సూచించింది.. కోర్టు సూచనతో తాము చేసిన ఆరోపణలను ఉపసంహరించుకున్నారు ఇరువురు నేతలు… రాజీ కోసం సంతకాలు కూడా చేశారు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ. దీంతో రాయపాటి సాంబశివరావుపై కన్నా లక్ష్మీనారాయణ వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టివేసింది కోర్టు.
తాజావార్తలు
-
CM Convey: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!