Margani Bharatram: ఆ అరెస్టుల్లో రాజకీయ దురుద్దేశం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో చట్ట ప్రకారమే టీడీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్. చిట్ ఫండ్ సెక్షన్ యాక్ట్ 5 ఆధారంగానే టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ ల అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీ అవకతవకలే కారణమని ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలను అడ్డుపెట్టుకుని టిడిపి నేతలు దోచుకుంటున్నారని, కానీ ప్రజా సంక్షేమం కోసమే సీఐడీ దాడులు చేస్తుందని అన్నారు.
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
Also Read
కాల్ మనీ, ప్రజల దగ్గర నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. మహానాడు కోసం టిడిపి నేతలను అరెస్టు చేశారనడంపై ఆయన మండిపడ్డారు. మాకేంటి అవసరం ? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరగాళ్లు ఉంటే గాని మహానాడు నిర్వహించలేరా? అడిగారు. సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థలను రద్దుచేస్తాం, సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా..? అంటూ ఎంపీ భరత్ రామ్ ప్రశ్నించారు. చిట్ ఫండ్ అవకతవకాల్లో అరెస్టు అయి రాజకీయం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆరోపించారు. నేరస్తులు ఎవరైనా ఒక్కరేనని అన్నారు. పొలిటికల్ గా వాడుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ఇలాంటివి అన్నీ గమనిస్తున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ అన్నారు.
Read Also: Gorantla Buchiah Chowdary: ఓటమి భయంతోనే వైసీపీ నేతల దాడులు
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!