Rahul Gandhi: మోడీ చేతిలో ఏపీ ప్రభుత్వం కీలుబొమ్మ..! అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతిలోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక, అన్నదమ్ముల్లా కలసి ఉన్న దేశాన్ని బీజేపీ విభజిస్తోందని విమర్శించిన ఆయన.. కుల, మతాల పేరుమీద విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రధాని నరేంద్ర మోడీ రిమోట్తో ఆంధ్రప్రదేశ్ని శాసిస్తున్నారు.. అందుకు కారణం ఏమిటో అందరికీ తెలుసు అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Pothula Sunitha: బాబు, పవన్ కలసి పోటీచేసినా డిపాజిట్లు కూడా రావు..!
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
మరోవైపు బీజేపీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కమిట్మెంట్స్ ఉన్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ.. కానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్తో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయని తెలిపారు.. మేం పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ , రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. ఈ అంశాలను లెవనెత్తడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డ ఆయన.. బీజేపీ కంట్రోల్ లో ఉన్నందుకు ఈ అంశాలు లెవనెత్తడం లేదని ఆరోపించారు.. రాయలసీమకు న్యాయం చేయడం, స్పెషల్ స్టేటస్ కు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.. కాగా, రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని.. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలన్నారు. మూడు రాజధానుల ఆలోచన సరికాదని హితవుపలికిన ఆయన.. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. పోలవరం పూర్తి చేస్తామని ఉదయం రాహుల్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..