Andhra Pradesh: అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ శనివారం నాడు పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్ ను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందు సీఎం జగన్ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. బస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానిక మహిళలు, చిన్నారులు నాయకులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం బస్ టెర్మినల్ ప్రారంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
Read Also: Drugs Gang Busted: ఓర్నీ భలే ఐడియా.. పెళ్లి బట్టల్లో డ్రగ్స్.. గ్యాంగ్ గుట్టురట్టు
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
పులివెందులను ఆదర్శ నియోజకవర్గం చేయడం కోసం మూడున్నరేళ్లుగా సమున్నత అడుగులు పడ్డాయన్నారు. అందులో భాగంగానే అత్యాధునిక వసతులతో మోడల్ టెర్మినల్ తరహాలో పులివెందుల్లో బస్ టెర్మినల్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ బస్ టెర్మినల్ మిగతా వాటన్నిటికీ రోల్ మోడల్గా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పులివెందులలో బస్ టెర్మినల్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని విమర్శించిన చంద్రబాబుకు ఈ బస్ టెర్మినల్ చూస్తే వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తుందని చురకలంటించారు. ప్రస్తుత పులివెందుల బస్ టెర్మినల్ చూస్తే వాళ్లకు అసూయ కలుగుతుందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజల తలరాతలు మారుతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమం దిశగా వివక్ష లేని దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామన్న సీఎం జగన్, సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుస్తున్నామని పేర్కొన్నారు.
రూ. 13 వేల కోట్లతో పులివెందుల మీదుగా ఆరు లైన్ల హైవే..
రాష్ట్రంలో పులివెందుల నుంచి బెంగళూరు వరకు నాలుగు లేన్ల హైవే నిర్మాణం కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు సీఎం జగన్ వివరించారు. దీంతో పాటు రూ.13 వేల కోట్ల ఖర్చుతో బెంగుళూరు నుంచి పులివెందుల మీదుగా విజయవాడ వరకు ఆరు లైన్ల రహదారి విస్తరణ కృషి చేస్తున్నట్లు తెలిపారు. పులివెందుల పట్టణంలోని ఐదు జంక్షన్లలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల చిరకాల కోరిక అయిన రాయలపురం బ్రిడ్జిని కూడా ప్రారంభించామన్నారు. సంక్షమం అభివృద్ధి రెండు కళ్ల తరహాలో అభివృద్ధి జరుగుతున్నా ఎల్లో మీడియా అవేం పట్టనట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీరి దత్తపుత్రుడు వంటి చెడిపోయిన వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వీరికి కనపడదు వినపడదు అన్నట్లుగా తప్పుడు రాతలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఈ తప్పుడు రాతలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. పులివెందుల ప్రజలు నాకు ఇస్తున్న భరోసాతోనే వచ్చే ఎన్నికల్లో మనం 175 స్థానాల్లో విజయం సాధించగలమన్నారు. ఈ సంకల్పంతో వైసీపీ మొక్కవోని దీక్షతో పనిచేస్తోందని వివరించారు.
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!