Prakasam District: బెల్టు షాపు వివాదం..! గ్రూపులుగా విడిపోయి పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఒకేపార్టీ నేతలు..!
- ప్రకాశం జిల్లాలో బెల్టుషాపు విషయంలో గొడవ..
- పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు..
- తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam District: కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.. బెల్టుషాపుల విషయంలో కఠినంగా ఉంటాం.. బెల్టుషాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే హెచ్చరించారు.. అయితే, ప్రకాశంజిల్లాలో బెల్టుషాపు కారణంగా టీడీపీలోని రెండు గ్రూపులు పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు చేసుకొని తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు..
Read Also: SIT Notice to MP Mithun Reddy: ఎంపీ మిథున్రెడ్డికి సిట్ నోటీసులు.. హైకోర్టులో ఊరట..!
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో బెల్టుషాపు విషయంలో టీడీపీలోని రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకొని పొట్టు పొట్టుగా తలలు పగిలి రక్తం కారేలా కొట్టుకున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రామంలో బెల్టుషాపులు పెట్టుకొని మద్యం అమ్ముకునే విషయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నేత మన్నే రవీంద్ర వర్గంపై యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గం దాడి చేసి పొట్టు పొట్టుగా కొట్టారు.. ఈ దాడిలో టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర బామ్మర్ది, భార్య మాధవితోపాటు ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి.. టీడీపీ నాయకుడు మన్నే రవీంద్ర వర్గం కూడా ప్రతి దాడి చెయ్యడంతో ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గంలోని ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మొత్తం 10 మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు అవ్వడంతో వారిని హుటాహుటిన యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.. బెల్ట్ షాప్ కోసం టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఇరువర్గాల దాడితో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని మిట్టపాలెం గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.. విషయం తెలుసుకున్న త్రిపురాంతకం పోలీసులు గ్రామంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!