Prakasam District: బెల్టు షాపు వివాదం..! గ్రూపులుగా విడిపోయి పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఒకేపార్టీ నేతలు..!
- ప్రకాశం జిల్లాలో బెల్టుషాపు విషయంలో గొడవ..
- పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు..
- తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam District: కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.. బెల్టుషాపుల విషయంలో కఠినంగా ఉంటాం.. బెల్టుషాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే హెచ్చరించారు.. అయితే, ప్రకాశంజిల్లాలో బెల్టుషాపు కారణంగా టీడీపీలోని రెండు గ్రూపులు పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు చేసుకొని తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు..
Read Also: SIT Notice to MP Mithun Reddy: ఎంపీ మిథున్రెడ్డికి సిట్ నోటీసులు.. హైకోర్టులో ఊరట..!
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో బెల్టుషాపు విషయంలో టీడీపీలోని రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకొని పొట్టు పొట్టుగా తలలు పగిలి రక్తం కారేలా కొట్టుకున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రామంలో బెల్టుషాపులు పెట్టుకొని మద్యం అమ్ముకునే విషయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నేత మన్నే రవీంద్ర వర్గంపై యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గం దాడి చేసి పొట్టు పొట్టుగా కొట్టారు.. ఈ దాడిలో టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర బామ్మర్ది, భార్య మాధవితోపాటు ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి.. టీడీపీ నాయకుడు మన్నే రవీంద్ర వర్గం కూడా ప్రతి దాడి చెయ్యడంతో ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గంలోని ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మొత్తం 10 మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు అవ్వడంతో వారిని హుటాహుటిన యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.. బెల్ట్ షాప్ కోసం టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఇరువర్గాల దాడితో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని మిట్టపాలెం గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.. విషయం తెలుసుకున్న త్రిపురాంతకం పోలీసులు గ్రామంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!