Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అప్పులు చేసి కొందరికి లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబుకు వైసీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదని అంబటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి వివిధ రకాలుగా ట్రోల్ చేశారని అన్నారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
Read Also: Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
అమరావతిలో భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.16 వేల వరకు ఖర్చు చూపడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు అంబటి… రాష్ట్రాన్ని కొందరు దోపిడీదారులకు అప్పగించేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టులు ఇచ్చి కిక్బ్యాక్స్ రూపంలో నిధులు వెనక్కి తీసుకుంటున్నారని విమర్శించారు. “అసలు అమరావతి ఎక్కడుంది.. రాజధాని ఎక్కడుంది” అంటూ అంబటి వ్యాఖ్యానించారు. గుంటూరు వెళ్లి బస్ టికెట్ అడిగితే అమరావతి గుడికి టికెట్ ఇస్తారని వ్యంగ్యంగా అన్నారు. సంపద సృష్టి అనే మాటలు నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికే వర్తిస్తాయని విమర్శించారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు లేవని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి రాజధాని పేరుతో అప్పులు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు. రాజధానిలో దోచుకోవడానికి నిధులు ఉన్నా, పేదలకు పథకాలు ఇవ్వడానికి నిధులు లేవని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అంబటి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు కాకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తే వైసీపీదే విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ఇక, జాతీయ రాజకీయాలపై కూడా అంబటి వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు మధ్య హాట్లైన్ ఇంకా కొనసాగుతోందని అన్నారు. మహిళా బిల్లు ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..