Post Master Fraud: పోస్టుమాస్టర్ నిర్వాకం.. పొదుపు డబ్బులతో పరార్
జనం సొమ్ముకు గాలం వేశాడు… పోస్టాఫీసుకు తాళం వేశాడు. పోస్టుమాస్టర్ నిర్వాకంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని బీదజనం. ఆరుగాలం కష్టించి తమ భవిష్యత్ అవసరాలకోసం కొంచెం కొంచెం సొమ్ము పొదుపుచేసుకున్నారు. ఆ సొమ్మును సాంతం తీసుకొని పరారయ్యాడు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే ఉన్నతమైన సంస్దలో కూడా తమ సొమ్ముకు భరోసా లేకపోవడంతో బాధితుల వేదన వర్ణనాతీతం.
తాళ్లరేవు మండల పరిధిలోని కేశవపురం పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్టుమాస్టర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము పోస్టాఫీసులో దాచుకున్నారు. పోస్టుమాస్టర్ డబ్బుతో పరారు అయ్యాడని తెలియడంతో వారికి కంటిమీద కునుకులేకుండా పోయింది. మండల కేంద్రమైన తాళ్లరేవు పంచాయతీలోగల కేశవపురం పోస్టాఫీసులో సుమారు 600 మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ఎస్బీ అకౌంట్ లతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు, ఆర్పీఎల్బీ, సుకన్య తదితర పథకాల ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. ఈ శాఖ తాళ్లరేవు సబో పోస్టాఫీసుకు అనుబంధంగా పనిచేస్తుంటుంది. అయితే ఇక్కడ పోస్టుమాస్టర్ పనిచేస్తున్న సీహెచ్ సుబ్రహ్మణ్యం ఈ నెల 5వ తేదీ నుంచి కార్యాలయానికి రాకపోవడం, తాళాలు వేసి ఉండడంతో సంబంధిత శాఖ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
TCongress : రేవంత్ రెడ్డి Vs కోమటిరెడ్డి..కాంగ్రెస్లో చేరికల జగడం @జడ్చర్ల
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఈ నేపథ్యంలో కాకినాడ సౌత్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎస్.సూర్యప్రకాష్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో సుబ్రహ్మణ్యం చేసిన పలు అక్రమాలు బయటపడ్డాయి. నకిలీ ఓచర్లతోపాటు తెల్ల కాగితంపై చేతితో రాసిన బిల్లులు ఉండడాన్ని గుర్తించారు. నా భర్త గత ఏడాది కోవిడ్లో చనిపోయారు విద్యార్థులంతా తలో చెయ్యివేసి సుమారు రూ.80 వేలు సేకరించి ఇవ్వగా పోస్టాఫీస్లో డిపాజిట్ చేశాం అంటూ ఒక మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టాఫీసు ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారులకు న్యాయంచేయాలని, తమ సొమ్ముకు భరోసా కల్పించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
పోస్టాఫీసులో గోల్డ్ లోన్ సౌకర్యం లేదు. అయితే పరారైన పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యం గోల్డ్ లోన్లు కూడా ఇచ్చి జనాలను మోసగించిన వైనం బయట పడింది. స్థానిక రత్సవారిపేట గ్రామానికి చెందిన బొక్కా వెంకటలక్ష్మి నుంచి 24 గ్రాముల బరువైన చైను, సూత్రాలను తాకట్టు పెట్టుకుని రూ.65 వేలు మంజూరు చేశాడు. అదికూడా కేవలం ఒక తెల్ల కాగితంపై రాసి సంతకం పెట్టి, పోస్టాఫీసుకు సంబంధంలేని తన సొంత స్టాంపువేసి ఇచ్చాడు. నా నగల విలువ సుమారు రూ.1,20,000 ఉంటుందని, ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.అంతే కాకుండా అమ్మవడి, తదితర ఇతర ప్రభుత్వ పధకాల సొమ్మును కూడా తన సొంతానికి వాడుకుని పరారైనట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BJP : ఓరుగల్లులో ఆపరేషన్ ఆకర్ష్ జోరు..TRS, BJP రకరకాల వ్యూహాలు
తాజావార్తలు
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో