గుడిసెను కమ్మేస్తున్న కాలుష్యం… అందుకే నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుడిసె..ఇప్పుడు పర్యాటకుల ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న పర్యటక ప్రాంతం..! తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్న ఈగ్రామానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే విచ్చలవిడిగా రూల్స్ ఉల్లంఘించడంతో…. వచ్చే నెల 20 వరకు అనుమతిని నిలిపివేశారు. కాలుష్య నివారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండవంటున్నారు అధికారులు.
తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లిలో ఉన్న గుడిసె పర్యాటకుల సొంతం. పర్యాటకుల మదిని దోచే అందాలకొండ గుడిసె. దీని ప్రత్యేకతే వేరు. మారేడుమిల్లికే వన్నె తెచ్చిన వన దేవతకు కలికి తురాయిగా పేరొందిన ప్రాంతం ఇది. నిత్యం వేలాదిమంది వాహనాల్లో ఇక్కడికి తరలివస్తుండడంతో సందడిగా మారుతోంది. మారేడుమిల్లి పరిసరాల్లోని జలపాతాలు, పర్యాటక ప్రదేశాలను అటవీశాఖ ఆధ్వర్యంలో సీబీఈటీల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. పుల్లంగి పంచాయతీలోని ఈ కొండ తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా ఖ్యాతి చెందింది.
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

అయితే ఇప్పుడు ఈపర్యాటక ప్రాంతానికి తాకిడి పెరడగంతో పర్యారణ ముప్పు ఏర్పడింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు చెత్త, చెదారాలను విచ్చలవిడిగా పడేస్తున్నారు. రాత్రులు మంటలు వేసుకోవడం, మద్యం సేవించిన బాటిల్స్ పగులకొట్టి పాడేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో అందాల కొండ గుడిసెకు పర్యావరణ ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో పర్యాటకులను మార్చి 20వ తేదీ వరకు నిలుపుదల చేశారు. గుడిసె పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకే ఈ చర్యలు చేపట్టారు.
గుడిసె అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకే రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. పీవో ప్రవీణ్ ఆదిత్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొండ కిందనున్న గుండ్రతి వద్ద కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రహదారి నిర్మించేందుకు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆద్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ, అటవీ, ఐటీడీఏ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి మార్చి 20వ తేదీ నుండి తిరిగి పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
-
Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!