టంగుటూరులో తల్లి, కూతుళ్ల హత్య కేసులో పురోగతి ఏది..?
ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్య జరిగింది. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేదు. కుమార్తెకు ఫోన్ చేయగా కుమార్తె ఫోన్ నుంచి కూడా సమాధానం రాలేదు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూడగా భార్య శ్రీదేవి, కుమార్తె వెంకట లేఖన(21)లు గొంతు కోసిన స్ధితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే అతడు చుట్టు పక్కల వారికి విషయాన్ని తెలిపి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
హత్య జరిగి ఇప్పటికి 15రోజులు అవుతంది. తల్లి కూతుళ్ల ఇద్దర్ని అతి కిరాతకంగా హత్య చేసినా చుట్టు పక్కల వారికి ఎలాంటి సౌండ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముందుగా పార్థీ గ్యాంగ్ పనే అయి ఉంటుందని అనుమానించిన పోలీసులు, ఆ తర్వాత స్థానికులు కూడా అయి ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పోలీసులకు ఒక్క బ్రేక్ త్రూ పాయింట్ కూడా ఈ హత్య కేసులో లభించలేదు. డాగ్ స్వాకాడ్ తిరిగిన ప్రాంతాన్ని పోలీసులు మరోసారి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే టంగుటూరులో పలు షాపుల యాజమానులను పోలీసులు విచారించి వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. కాగా వీరికి ఎవ్వరితోనైనా విబేధాలు ఉన్నాయ అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
మరో వైపు కేవలం బంగారం కోసమే నిందితులు తల్లి, కూతుళ్లను హత్య చేసి ఉంటే ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని ఊడ్చుకు పోవాలని కానీ, కేవలం ఒంటి మీద ఉన్న బంగారు నగలను మాత్రమే తీసుకుని వెళ్లడం అటు పోలీసులను ఇటు స్థానికులను కలవరపెడుతున్నాయి. వారి ఒంటి మీద అయిన గాయలను బట్టి ఈ హత్యలో ఇద్దరి కన్నా ఎక్కువ మంది పాల్గొనే అవకావశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి కేసు విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో త్వరగా నిందితులను పట్టుకుని ఒక ముగింపు తేవాలని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!