Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన సీఐ నాగరాజుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కాసేపటి క్రితం విజయవాడ సూర్యారావుపేటలోని సౌత్ ఏసీపీ మానస కార్యాలయంలో లొంగిపోయారు. సీఐ నాగరాజు అరెస్టు అనంతరం వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అశోక్, నానిపై ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. వీరిద్దరూ విధులకు గైర్హాజరుకావడంతో పాటు కేసు విచారణకు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
సిట్ నిర్వహించిన ప్రాథమిక విచారణలో సీఐ నాగరాజుకు ఈ ఘటనలో అశోక్, నాని సహకరించినట్లు తేలినట్లు సమాచారం. కస్టోడియల్ డెత్ అనంతరం మృతదేహాన్ని మాయం చేయడంలో కూడా వీరిద్దరూ కీలక పాత్ర పోషించినట్లు సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో వారిని నిందితులుగా చేర్చుతూ ఇప్పటికే మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
వీరిద్దరిని పట్టుకునేందుకు సిట్ అధికారులు హైదరాబాద్, బెంగళూరు నగరాలకు ప్రత్యేక బృందాలను పంపారు. కుటుంబ సభ్యులను కూడా పలుమార్లు విచారించారు. ఈ క్రమంలోనే అశోక్, నాని స్వచ్ఛందంగా లొంగిపోవడం కేసు విచారణలో కీలక మలుపుగా భావిస్తున్నారు. లొంగిపోయిన అనంతరం సౌత్ ఏసీపీ మానస ఇద్దరినీ ప్రాథమికంగా విచారించి, తదుపరి సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం సిట్ అధికారులు వారిని సుదీర్ఘంగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సాయికృష్ణ మృతదేహం ఏమైంది.? కస్టోడియల్ డెత్ అనంతరం ఏం జరిగిందనే.. అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వీరి విచారణ ద్వారా కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి మరో కానిస్టేబుల్ మురళీకృష్ణతో పాటు బాబూరావును కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి వ్యక్తి నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోవడంతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మృతదేహం అదృశ్యం, ఘటన అనంతర పరిణామాలపై కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!