OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: వైసీపీ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ రాజకీయ అడుగులపై ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. 2019లో ఎర్రగొండపాలెం నుంచి విజయం సాధించిన ఆదిమూలపు… 2024 ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ప్రకారం కొండేపికి షిఫ్ట్ అయి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గానికి చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్నారని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్పై వైసీపీలోనే రకరకాల ప్రచారాలు వినిపించాయి. కొండేపిలో ఆయన యాక్టివ్గా కనిపించడం లేదన్న అభిప్రాయం ఒకవైపు ఉంటే… తిరిగి ఎర్రగొండపాలెం వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం మరోవైపు సాగింది. అయితే… ప్రస్తుతం అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 మందిలో తాటిపర్తి కూడా ఒకరు కావటంతో…. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని పక్కనపెట్టి ఆదిమూలపు సురేష్ను తిరిగి అక్కడికి పంపుతారా అన్న డౌట్స్ కూడా వచ్చాయి చాలామందికి. అలాగే… కొండేపిలో వైసీపీ తరపున గెలవటంపై అనుమానాలు ఉండటం వల్లే ఆయన ఆసక్తిగా లేరని కూడా చెప్పుకున్నారు. అందుకే ఎర్రగొండపాలెం నుంచి అవకాశం లేకుంటే…. గతంలో తాను పోటీ చేసి గెలిచిన సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి అయినా యాక్టివ్ అవుతారని, ముందుగానే వెళ్లి కాస్త గ్రౌండ్ వర్క్ చేసుకుంటే గెలవవచ్చన్న ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది.
ప్రస్తుతం సంతనూతలపాడు ఇంచార్జ్గా ఉన్న మరో మాజీ మంత్రి మేరుగు నాగార్జున కూడా వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం వేమూరు నుంచి పోటీకే ఆసక్తిగా ఉన్నారట. దాంతో… ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు వెళ్ళడం ఖాయమని కూడా కొందరు గట్టిగానే చెప్పారు. కానీ… ప్రస్తుతం పరిస్థితులు మారిపోయి ఆదిమూలపు సడన్గా కొత్త టర్న్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కొండేపి నుంచే పోటీ చేస్తానని ప్రకటించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇన్నాళ్ళు నియోజకవర్గానికి వచ్చామా.. వెళ్లామా అన్నట్లుగా టైంపాస్ చేసిన మాజీ మంత్రి ఇటీవల మనసు మార్చుకున్నారట. గతంలో పార్టీ కార్యక్రమాలను సైతం ద్వితీయ శ్రేణి నేతలకు అప్పగించి మమ అనిపించిన సురేష్…. ప్రస్తుతం అన్నీతానే పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. పార్టీ శ్రేణులను గట్టిగానే కార్యక్రమాలకు మొబలైజ్ చేస్తున్నారని సమాచారం.. ఇటీవల పలు సందర్బాల్లో పార్టీ నేతలతో మాట్లాడిన మాజీ మంత్రి తాను వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, త్వరలోనే కొండేపిలో సొంత ఇల్లు కూడా కట్టుకుంటానని చెప్పేశారట. ఇదే సమయంలో టంగుటూరు మండలం జమ్ములపాలెంలో కూటమి నుంచి పలువురిని వైసీపీలోకి ఆహ్వానించటం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆయన ఇక కొండేపిలోనే కంటిన్యూ అవుతారని పార్టీ వర్గాలు కూడా ఫిక్స్ అవుతున్నాయి. దీంతో ఎర్రగొండపాలెం… సంతనూతలపాడు… కొండేపి… ఈ మూడు నియోజకవర్గాల చుట్టూ సాగిన ప్రచారానికి ఇప్పటికైతే తెరపడినట్టేనని అంటున్నారు. మరి సురేష్… తాను చెప్పినట్టే కొండేపికి సింక్ అవుతారా? లేక ఎన్నికల నాటికి మళ్ళీ పరిస్థితులు మారతాయా అన్నది వేచి చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!