Kishan Reddy: ఢిల్లోలో పింగళి వెంకయ్య ఫొటోతో పోస్టల్ స్టాంపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లోలో ఆయన ఫొటోతో పోస్టల్ స్టాంపును విడుదల చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆగష్టు 2న పింగళి వెంకయ్య శత జయంతి జరుపుకుంటున్నామని అన్నారు. పింగళి వెంకయ్య స్వగ్రామం భట్ల పెనుమర్రు వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తామని అన్నారు. ఢిల్లి, కోల్ కత్తాలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని అన్నారు. వెంకయ్య రూపొందించిన నిజమైన జెండాను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. మువ్వన్నెల జెండా చూస్తే జాతీయత ఉప్పొంగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆగష్టు13-15వరకు దేశంలో ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా రెపరెపలాడాలని తెలిపారు. ప్రధాని కూడా అన్ని రాష్ట్రాల సీఎంలతో దీనిపై మాట్లాడారని గుర్తుచేసారు. హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమం చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా ఇళ్ల పై జెండాను ఎగురేయాలని అన్నారు. భారతీయులు దేశ భక్తికి చిహ్నంగా అందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు.
read also: Kishan Reddy: లంబసింగిలో రూ. 35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం
Also Read
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
ఆగష్టు 2నే పింగళి జయంతి సభ వేదిక మీద నుంచే ఒక పాట విడుదల చేస్తున్నామని స్పష్టం చేసారు. ప్రధాని, అమిత్ షా లు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సన్మానిస్తారని అన్నారు. ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ నుంచి పార్లమెంటు విజయ చౌక్ వరకు ఆగష్టు3న యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు అంతా మోటార్ సైకిల్ పై తిరంగా యాత్రలో పాల్గొంటారని అన్నారు. ఆగష్టు14న మన దేశాన్ని విభజించిన రోజని, గాంధీ ఆలోచన విధానానికి విరుద్ధంగా భారతదేశాన్ని చీల్చారని మండిపడ్డారు. పాకిస్తాన్, హిందూస్థాన్ గా విడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మతం పేరుతో పది వేల మందిని ఆరోజు ఊచకోత కోసి చంపారని మండిపడ్డారు. ఆ రోజును పాకిస్తాన్ విభజన్ కా విదుష్ కా స్మృతి దివస్ పేరుతో కార్యక్రమం చేపడతామన్నారు. ఆరోజు చనిపోయిన వారికి శ్రద్దాంజలి ఘటించి గుర్తు చేసుకుంటామన్నారు.
read also: Earthquake: నేపాల్ లో భూకంపం.. 6.0 తీవ్రతతో కంపించిన భూమి
ఆరోజు పారిపోయి వచ్చిన వారిని సభకు తీసుకువస్తామన్నారు. ఆగష్టు14 రాత్రి అందరూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. యువకులు ఎక్కడికక్కడ మోటారు సైకిళ్ల యాత్రను నిర్వహించాలని అన్నారు. ఆగష్టు 9 తరువాత ఎప్పుడు వీలైతే అప్పుడు ర్యాలీలు చేపట్టాలని అన్నారు. మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి అలంకరించాలని పిలుపునిచ్చారు. ఆగష్టు15న పూలమాలలు వేసి ఘనంగా నివాళలు అర్పించాలని, ప్రతి భారతీయుడూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఎవరికి వారు జెండాను కొనుక్కుని ఎగుర వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని ఫోస్టాఫీసులలో జెండాలను అందుబాటులొ ఉంచుతామన్నారు. జెండాల తయారీ పై తయారీదార్లకు కూడ లేఖలు రాశామన్నారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసి ప్రధాని తరపున ఆహ్వానం అందిస్తామని అన్నారు. అన్ని ఖాదీ పరిశ్రమలకు కూడా ఆర్డర్లు ఇచ్చామన్నారు. అయితే ఖాదీ ద్వారా అన్ని జెండాలు తయారీ సాధ్యం కాదని పేర్కొన్నారు. వెంకయ్యకి భారతరత్న అంశంపై చర్చ జరగలేదని గుర్తు చేసారు. దీని పై కూడా కమిటీలో చర్చిస్తామన్నారు.
Director Lakshmikanth Chenna: నన్ను క్షమించండి.. దయచేసి ఆవీడియోను డిలీట్ చేయండి
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!