Kishan Reddy: లంబసింగిలో రూ. 35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ. 35 కోట్లతో లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అల్లూరి సీతారామరాజు వీర మరణం పొందిన స్థలం, నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అల్లూరి, ఘంటసాల, నన్నయ్య వంటి వారి గురించి ప్రధానికి వివరించామని స్పష్టం చేసారు. వాళ్ల గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకునే విధంగా కేంద్రం ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్పష్టం చేసారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, బలి దానాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారని వివరించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. దేశాభివృద్ధికి కష్టపడి పని చేశారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను ఈయేడాది ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నాటి త్యాగధనుల గురించి నేటి తరం తెలుసుకునేలా భారత ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.
read also: హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే..
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రధాని అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 250 మంది ఉన్న ఈ కమిటీలో రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని అన్నారు. సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలు చూసే బాధ్యత నాకు అప్పగించారని అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో భాగమై పని చేస్తున్నాయని అన్నారు. ఆగష్టు 15, 2023 వరకు ఈ ఆజాది కా అమృత్ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కేంద్ర మంత్రి అన్నారు. 2047కి స్వాతంత్ర్య సాధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటామని హర్షం వ్యక్తం చేసారు. ఈ పాతికేళ్లు మన దేశానికి బంగారు ఘడియలని కేంద్ర మంత్రి కిషన్ తెలిపారు. రాజకీయాలకతీతంగా మన దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఇందులో యువత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నాని, వచ్చే 25 సంవత్సరాల తరువాత యూత్ పాపులేషన్ మనకు తగ్గుతుందని, అందరం ఎజెండా పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ప్రధాని, కమిటీ సభ్యులు కూడా ఈ అంశాలపై చర్చ చేసి కార్యాచరణ రూపొందిస్తారని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!