AP: సర్కార్ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్.. హైకోర్టులో పిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.. ఇక, ఆ పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. ప్రతివాదులుగా ఏపీ సీఎస్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కడప కలెక్టర్, రాజంపేట ఆర్డీవోలను పేర్కొంటూ పిల్ దాఖలు చేశారు బీజేపీ నేత రమేష్ నాయుడు.
Read Also: AP: నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ ఉక్కుపాదం
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 33 మంది ప్రాణాలు కొల్పోయారని పిటిషనర్ పేర్కొన్నారు.. పెద్ద ఎత్తున మామిడి, నిమ్మ, అరటి, దానిమ్మ, కొబ్బరి, టొమోట తోటలు నష్టపోయాయన్న పిటిషనర్.. మృతుల కుటుంబాలకు.. పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ హైకోర్టును కోరారు.. ఇక, విచారణకు స్వీకరించి హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో బాధితులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందోననే వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించింది.. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!