Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Payyavula Keshav Comments On Ap Cabinet Decisions

Payyavula Keshav: 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే దమ్ముందా?

Published Date :December 13, 2022 , 12:58 pm
By Ramesh Nalam
Payyavula Keshav: 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే దమ్ముందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Payyavula Keshav: ఏపీ కేబినెట్ సమావేశంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని.. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అస్మదీయులకు కట్టబెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను తాము బ్యాక్ గ్రౌండ్‌గా ఉన్న కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

టెండర్ల ద్వారా లేదా బిడ్డింగ్ ద్వారా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కేటాయింపులు జరపాలని.. నామినేషన్ విధానంలో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏ విధంగా కట్టబెడతారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. నెడ్ క్యాప్‌తో సర్వే చేయించి.. నెడ్ క్యాప్ సంస్థ గుర్తించిన స్థలాల్లో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రారంభించారని.. ప్రభుత్వ సొమ్ముతో సర్వేలు చేయించుకుని.. టెండర్లు పిలవకుండా ప్రాజెక్టులు నామినేటెడ్ పద్దతిన కట్టబెట్టేస్తారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై గతంలో తాను చేసిన ఆరోపణలకు ఏ మాత్రం సమాధానం చెప్పలేదని.. ఇప్పుడైనా చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు షరతులు పెడతారని.. షరతులు పెట్టి టెండర్లు ఖరారు చేయాల్సిన చోట నామినేటెడ్ పద్దతిలో కట్టబెట్టేస్తున్నారని పయ్యావుల విమర్శలు చేశారు. బంధువులనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నందుకే.. ఆ కంపెనీలకు ప్రభుత్వం హైడ్రో పంప్డ్ ప్రాజెక్టులు కట్టబెట్టినట్టుగా కన్పిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం పీఏసీని నిర్వీర్యం చేస్తోందని.. పీఏసీలోని భర్తీలను కూడా ఫిలప్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కోరం లేకుండా చూడడం ద్వారా పీఏసీ సమావేశాలు జరగనిచ్చేవారు కాదన్నారు. కొంత కాలం వేచి చూస్తానని.. అప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత లేకుంటే పీఏసీ ఛైర్మన్ హోదాలో తానే సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు.

Read Also: Udhayanidhi Stalin: మంత్రి కాబోతున్న యంగ్ హీరో!

ఈ ప్రభుత్వానికి 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరిపే దమ్ముందా అని పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. మూడు రోజుల పాటు సమావేశాలు పెట్టడం.. తమకు కావాల్సిన బిల్లులను ఆమోదింపచేసుకుని వెళ్లిపోవడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని చురకలు అంటించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారని.. విండ్ పవర్.. సోలార్ పవర్ కొనుగోళ్లల్లో టీడీపీ అనేక అక్రమాలు చేసిందని ప్రమాణస్వీకార వేదిక మీదే జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. అసెంబ్లీలో కూడా ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా చూపించారన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందా.. లేదా.. అనేది నాలుగేళ్ల తర్వాత కూడా ఏం తేలలేదన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లల్లో సూది మొనంత అవినీతి జరగలేదని హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు. హైకోర్టు చెప్పడమే కాదు.. ప్రభుత్వమూ అంగీకరించిందని.. విద్యుత్ సంస్థలకు చెల్లింపులు ప్రారంభించారన్నారు. సీఎం హోదాలో జగన్ చేసిన ప్రకటనల వల్ల రాష్ట్రంపై నమ్మకం కొల్పోయిందని పయ్యావుల అన్నారు.వ్యవసాయ రంగానికి సోలార్ విద్యుత్ అయిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారని.. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల భారం ప్రజలపై పడుతోందన్నారు. సెకీ పిలిచిన టెండర్లను అన్ని రాష్ట్రాలు తిరస్కరిస్తే.. దాన్ని జగన్ ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు. దేశంలో అతి ప్రయోగత్మకంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో ప్రారంభించారని పయ్యావుల అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Cabinet Decisions
  • Assembly Sessions
  • Payyavula Keshav
  • Telugu Desam Party

తాజావార్తలు

  • Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..

  • Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • Sunil Gavaskar: పాక్‌ క్రికెటర్‌ కొనుగోలుపై విమర్శలు.. కావ్య మారన్‌ను నిలదీసిన గవాస్కర్..

  • NavIC: ఇబ్బందుల్లో స్వదేశీ GPS వ్యవస్థ ‘‘నావిక్’’.. 11 శాటిలైట్లలో 3 వర్కింగ్..

  • Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఒకొక్కరికీ రూ.2500..

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions