Pawan Kalyan: ఏపీలో బలమైన మార్పు తేవాలి.. జనసేనని ఎవరు అడ్డుకుంటారో చూద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Says There Is Strong Change Need In Andhra Pradesh: ఏపీలో బలమైన మార్పు తీసుకురావాలని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఆమంచి స్వాములును పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. తాను చీరాలలోనే పెరిగానని గుర్తు చేసుకున్నారు. చీరాల అనగానే చినరధం, పెద్ద రధం, జాలరీ పేట గుర్తొచ్చాయని అన్నారు. ఆమంచి స్వాములకు చీరాలలోనే బలం ఉందని తాను అనుకున్నానని.. కానీ విజయవాడ, గుంటూరు, ప్రకాశం నుంచి కూడా అభిమానులు ఉంటారని అనుకోలేదని చెప్పారు. ఆయన కోసం వచ్చిన అభిమానులు, కార్యకర్తలను చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.
West Bengal: బెంగాల్లో దెబ్బతిన్న పాఠశాలలు.. కారణమదే!
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఆమంచి స్వాములు లాంటి నేతలు జనసేనలో ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటని బయటపెట్టారు. రాష్ట్రంలో సరికొత్త మార్పుకి, కొత్త భవిష్యత్తుకి నాంది పలకాలని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే.. సీఎం జగన్ పోవాలని నినదించారు. రాజ్యం.. రాజ్యాధికారం ఒక్కరే చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. మన భవిష్యత్తును వేరే వాళ్లు నడిపిస్తామంటే కుదరదని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకు అండగా ఉంటాయన్నారు. జనసేన ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూద్దామని సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో జనసేన నేత మీద దెబ్బ పడితే.. తన మీద పడినట్టేనని పేర్కొన్నారు. అలాగే.. ఆమంచి స్వాములు మీద దెబ్బ పడితే, తన మీద పడ్డట్టేనని వెల్లడించారు. జనసేన కార్యకర్తలు, నేతల ప్రాణాలకు తన ప్రాణం అడ్డేస్తానని మాటిచ్చారు.
PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత ప్రధాని మోడీ ఫోటో
ఇదిలావుండగా.. ఇటీవల చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఆమంచి స్వాములు ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారాయి. ఆయన జనసేనలో చేరబోతున్నారా? అని డిబేట్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. ఆమంచి స్వాములు శనివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఆయన్ను పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!