Pawan Kalyan: మద్యంపై ఆదాయం వద్దన్నారు.. ఈ పాలసీ ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మద్యపాన నిషేధంపై విపక్షాలు అధికార పార్టీని విమర్శిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యంపై ఆదాయం వద్దన్న సీఎం.. మద్యం పాలసీ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. జనసేన ప్రారంభించిన నాటి నుంచి ప్రజా క్షేత్రంలో వుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. 4వేలు వుండే టన్ను ఇసుక ధర 28 వేలకు అమ్ముతున్నారు. మూడో విడత ” జనవాణి – జనసేన భరోసా ” కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా రాజధాని భీమవరంలో నిర్వహించారు జనసేనాని పవన్ కళ్యాణ్,
ఎస్సీలకు అండగా ఉంటామని వారిపై కేసులు పెడుతున్నారు. భీమవరంలో మాదిరిగానే అన్ని చోట్ల డంపింగ్ యార్డ్ ల సమస్యలు వేధిస్తున్నాయి. వైసీపీ నవ రత్నాల్లో కీలకమైన అంశం.. సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామన్న ప్రభుత్వం ఇపుడు నేరుగా మద్యం అమ్ముతుంది. 19సూట్ కేస్ కంపెనీ లు తయారు చేస్తున్న మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వకుండా నేరుగా డబ్బు దోచుకుంటున్నారు. మద్యం పై ఆదాయం వద్దన్న వారు కొత్త మద్యం పాలసీ ద్వారా 30వేల కోట్లు సంపాదించాలి అని చూస్తున్నారని పవన్ విమర్శించారు.
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జిలు ఉన్నాయి , కనీస మరమ్మత్తులు కూడా జిల్లాలో లేవు. ఉభయ గోదావరి జిల్లాలో డయాలసిస్ కేసులు చాలా పెరిగిపోతుండటం ఆందోళనకరం. దీనికి కారణాలు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు పవన్. జనవాణిలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి భారీ స్పందన లభించిందని జనసేన పార్టీ నేతలు తెలిపారు. ఈరోజు దాదాపు 492 అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా పంచాయితీ రాజ్, రోడ్లు, ఆర్థిక శాఖ, వైద్య శాఖ, ప్రభుత్వ పథకాల మీద ప్రజలు అర్జీలు సమర్పించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టిడ్కో ఇల్లు, డ్వాక్రా మహిళల సమస్యలు, డంపింగ్ యార్డ్ సమస్యలు , త్రాగునీరు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు.
తాజావార్తలు
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!