Devineni umamaheshwarRao: పోలవరాన్ని ముంచేసింది జగనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురు, శుక్రవారాల్లో పోలవరం నిర్వాసితులను పరామర్శించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు వెళ్లనున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheshwarao) చెప్పారు. గోదావరి వరదలో చిక్కుకున్న బాధితులకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను భువనేశ్వరి పూర్తి చేశారు. పండ్లు, ఫలాలు, తినుబండారాలు, మంచినీళ్లు సిద్ధం చేశాం. బాధితులను టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకుంటుంది. సీఎం చేతకానితనం, అసమర్థతతో వేలాది కుటుంబాలు గోదావరి ముంపులో చిక్కకున్నాయని దేవినేని ఉమా విమర్శించారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పోలవరాన్ని జగన్ ప్రభుత్వం వరదలో ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేసింది.తెలుగుజాతికి ద్రోహం చేసింది.దీనిపై 48గంటల్లో వివరణ ఇవ్వకుంటే ప్రభుత్వం తన తప్పిదాలను ఒప్పుకున్నట్లే అన్నారు ఉమా. దీనిపై ముఖ్యమంత్రి జాతి ప్రజలకు సమాధానం, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా వరదల్లో ఉన్న బాధితుల వద్దకు ఏ ఒక్క అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరూ వెళ్లకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా స్పందించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు దేవినేని ఉమా. సీఎం వాస్తవాలను పరిశీలించాలని, గాల్లో తిరిగితే వరద బాధితుల కష్టాల తీరతాయా అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
పోలవరం ముంపు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి జగన్ కి వాళ్ళు కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. వరద వచ్చే విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో విఫలం చెందారన్నారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీరుపై దేవినేని ఉమా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు వరద వస్తుందని తెలియదని చెప్పడం సిగ్గు చేటన్నారు. మహారాష్ట్రలో వరదలు వస్తున్నప్పుడు.. ఆ నీరు ఎగువ నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తాయని తెలుసుకోలేరా అని ఆయన ప్రశ్నించారు.
Bomb Explosion: పశ్చిమ బెంగాల్లో పేలిన బాంబు.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
తాజావార్తలు
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!