Devineni umamaheshwarRao: పోలవరాన్ని ముంచేసింది జగనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురు, శుక్రవారాల్లో పోలవరం నిర్వాసితులను పరామర్శించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు వెళ్లనున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheshwarao) చెప్పారు. గోదావరి వరదలో చిక్కుకున్న బాధితులకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను భువనేశ్వరి పూర్తి చేశారు. పండ్లు, ఫలాలు, తినుబండారాలు, మంచినీళ్లు సిద్ధం చేశాం. బాధితులను టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకుంటుంది. సీఎం చేతకానితనం, అసమర్థతతో వేలాది కుటుంబాలు గోదావరి ముంపులో చిక్కకున్నాయని దేవినేని ఉమా విమర్శించారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పోలవరాన్ని జగన్ ప్రభుత్వం వరదలో ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేసింది.తెలుగుజాతికి ద్రోహం చేసింది.దీనిపై 48గంటల్లో వివరణ ఇవ్వకుంటే ప్రభుత్వం తన తప్పిదాలను ఒప్పుకున్నట్లే అన్నారు ఉమా. దీనిపై ముఖ్యమంత్రి జాతి ప్రజలకు సమాధానం, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా వరదల్లో ఉన్న బాధితుల వద్దకు ఏ ఒక్క అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరూ వెళ్లకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా స్పందించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు దేవినేని ఉమా. సీఎం వాస్తవాలను పరిశీలించాలని, గాల్లో తిరిగితే వరద బాధితుల కష్టాల తీరతాయా అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
పోలవరం ముంపు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి జగన్ కి వాళ్ళు కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. వరద వచ్చే విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో విఫలం చెందారన్నారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీరుపై దేవినేని ఉమా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు వరద వస్తుందని తెలియదని చెప్పడం సిగ్గు చేటన్నారు. మహారాష్ట్రలో వరదలు వస్తున్నప్పుడు.. ఆ నీరు ఎగువ నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తాయని తెలుసుకోలేరా అని ఆయన ప్రశ్నించారు.
Bomb Explosion: పశ్చిమ బెంగాల్లో పేలిన బాంబు.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!