Devineni umamaheshwarRao: పోలవరాన్ని ముంచేసింది జగనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురు, శుక్రవారాల్లో పోలవరం నిర్వాసితులను పరామర్శించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు వెళ్లనున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheshwarao) చెప్పారు. గోదావరి వరదలో చిక్కుకున్న బాధితులకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను భువనేశ్వరి పూర్తి చేశారు. పండ్లు, ఫలాలు, తినుబండారాలు, మంచినీళ్లు సిద్ధం చేశాం. బాధితులను టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకుంటుంది. సీఎం చేతకానితనం, అసమర్థతతో వేలాది కుటుంబాలు గోదావరి ముంపులో చిక్కకున్నాయని దేవినేని ఉమా విమర్శించారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పోలవరాన్ని జగన్ ప్రభుత్వం వరదలో ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేసింది.తెలుగుజాతికి ద్రోహం చేసింది.దీనిపై 48గంటల్లో వివరణ ఇవ్వకుంటే ప్రభుత్వం తన తప్పిదాలను ఒప్పుకున్నట్లే అన్నారు ఉమా. దీనిపై ముఖ్యమంత్రి జాతి ప్రజలకు సమాధానం, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా వరదల్లో ఉన్న బాధితుల వద్దకు ఏ ఒక్క అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరూ వెళ్లకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా స్పందించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు దేవినేని ఉమా. సీఎం వాస్తవాలను పరిశీలించాలని, గాల్లో తిరిగితే వరద బాధితుల కష్టాల తీరతాయా అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
పోలవరం ముంపు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి జగన్ కి వాళ్ళు కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. వరద వచ్చే విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో విఫలం చెందారన్నారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీరుపై దేవినేని ఉమా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు వరద వస్తుందని తెలియదని చెప్పడం సిగ్గు చేటన్నారు. మహారాష్ట్రలో వరదలు వస్తున్నప్పుడు.. ఆ నీరు ఎగువ నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తాయని తెలుసుకోలేరా అని ఆయన ప్రశ్నించారు.
Bomb Explosion: పశ్చిమ బెంగాల్లో పేలిన బాంబు.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..