Pawan Vizianagaram Tour: విజయనగరం బయలుదేరిన పవన్… ఫ్యాన్స్ హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ నోవాటెల్ నుంచి విజయనగరం బయలుదేరారు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పవన్ విజయనగరం వెళుతున్నారని తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు విశాఖలోని పవన్ బస చేసిన హోటల్ కి చేరుకుని నినాదాలు చేశారు. ఇవాళ విజయనగరంలో గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహనిర్మాణాలను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ నుంచి రోడు మార్గంలో రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకుంటారు పవన్…
నోవాటల్ నుండి విజయనగరం రోడ్డు మార్గాన బయలుదేరారు. భీమిలి జాతీయ రహదారిపై స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకుంటారు పవన్. వై జంక్షన్ నుంచి ర్యాలీగా గుంకలాం చేరుకుంటారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం చేపట్టింది.
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
#JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా కాలనీలు, గృహనిర్మాణ స్థితిగతులను సామాజిక మాధ్యమాల్లో చూపించబోతున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని జనసేన చేపట్టింది. గుంకలాంలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించి పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు. 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారని జనసేన పార్టీ గుర్తుచేసింది. దీంతో సీఎం శంకుస్థాపన చేసిన గుంకలాం గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి ఇళ్లను పరిశీలిస్తారు. పవన్ పర్యటనపై వైసీపీ విమర్శలు చేస్తున్నా… వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని జనసేన పార్టీ పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!