Buddha Venkanna: రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి.. బుద్ధా వెంకన్న సవాల్
- రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ బుద్దా వెంకన్న సవాల్
- రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా- బుద్ధా వెంకన్న
- దమ్ముంటే రేపు నాపై దాడి చేయండి..- బుద్ధా వెంకన్న
- గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో..,
- మాపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేసాం- బుద్ధా వెంకన్న.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు. రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా.. దమ్ముంటే రేపు నాపై దాడి చేయండని అన్నారు. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తాను, బోండా ఉమా మాచర్ల వెళ్ళామని చెప్పారు.
Read Also: Hyderabad: పట్నంలో పల్లెటూరి వాతావరణం.. ఘనంగా సంక్రాంతి వేడుకలు..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
ఆ సందర్భంలో పిన్నెల్లి సోదరులు.. వేలంపాట పెట్టి వచ్చిన వారిని ఎవరు చంపుతారు, వారికి లైఫ్ సెటిల్మెంట్ అని పిలుపునిచ్చారని బుద్ధా వెంకన్న తెలిపారు. వేలం పాటలో తురకా కిషోర్ అనే వ్యక్తి తమను చంపేందుకు ముందు వచ్చాడని అన్నారు. వెదురు బొంగుతో తమపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు.. తమ నాయకుడు ధైర్యంతో, దేవుడి ఆశీస్సులతో తాము బయట పడ్డామని బుద్ధా వెంకన్న తెలిపారు. తమపై దాడిలో పాల్గొన్నది తురకా కిషోర్ అయితే.. దాడి చేయించింది పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసుని ఎవరు పట్టించుకోలేదని చెప్పారు.
Read Also: Bullet Bike: బుల్లెట్ బైక్ అమ్మేశారని బాలుడు ఆత్మహత్య..
ఇప్పుడు ఉన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎంతో నిజాయితీపరుడు.. తురకా కిషోర్ ని అరెస్ట్ చేయడంలో ఎస్పీ కీలక పాత్ర పోషించారని బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు తప్పించుకునేందుకు హై కోర్టులో ముందస్తు పిటిషన్ వేశారన్నారు. మీరు ఆషామాషీ వ్యక్తులతో పెట్టుకోలేదు.. బుద్దా వెంకన్న లాంటి వ్యక్తితో పెట్టుకున్నారని అన్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.. మీకు శిక్షలు పడే వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు. పిన్నెల్లి పై హైకోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయబోతున్నాను.. ముందస్తు బెయిల్ను రద్దుచేసే విధంగా పోరాడతానని బుద్ధా వెంకన్న తెలిపారు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
OTR : ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఆందోళనలు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!