Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అరెస్ట్
- హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
- 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన తురక కిషోర్
- మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న తురక కిషోర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కిషోర్ను.. పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా.. పలు కేసుల్లో తురక కిషోర్ నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
తురక కిషోర్పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధ వెంకన్నలపై మాచర్ల పట్టణంలో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 డిసెంబర్ 16న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై కిషోర్ దాడి చేశాడు. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని టీడీపీ ఆస్తులను, పార్టీ కార్యాలయం వాహానాలను ధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
2024 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున పలు హింసకాండలో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రెంటచింతల మండలం పాలువాయి గేటులో పోలింగ్ రోజు అక్కడ ఏజెంట్గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అలాగే మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టీడీపీ నేత ఎనుముల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువురిని గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామి పై దాడి, టీడీపీ కార్యాలయం విధ్వంసం, తెలుగుదేశం నాయకుల వాహనాలు ధ్వంసం చేసిన కేసులో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!