Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
- తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం
- ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డీఏ బకాయిలు,
- పీఆర్సీ ఏర్పాటు ఇతర అంశాలపై చర్చ
- ఉద్యోగుల ప్రమోషన్లు, శాఖల వారీగా విధుల విభజనపై చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డీఏ బకాయిలు, పీఆర్సీ ఏర్పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, శాఖల వారీగా విధుల విభజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా జాబ్ చార్ట్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: AP: రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి..
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. ఏడు నెలల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు. ఉద్యోగుల పని వాతావరణం మెరుగుపరుస్తాం అన్నారు.. ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా అని పేర్కొన్నారు. ఉద్యోగులకు గౌరవం లేకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం అని విమర్శించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో పెన్షన్ పంపిణీ చేయిస్తున్నారు.. మహిళా ఉద్యోగులను ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతున్నారన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
Read Also: CMR College: సీఎంఆర్ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్ట్..
పీఆర్సీ ఇవ్వడం తర్వాత.. కనీసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయండని తెలిపారు. కొత్త సంవత్సరం జనవరి 1న జీతాలు రావాలి.. ఉపాధ్యాయులకు ఇంకా జీతం లేదని చెప్పారు. ఉద్యోగులకు సరైన పని వాతావరణం కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని వెంకట్రామి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!