Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Warns Palnadu Rowdies In Macherla Public Meeting

CM Chandrababu: నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలకు అదే గతి..! సీఎం సీరియస్‌ వార్నింగ్..

Published Date :September 20, 2025 , 7:25 pm
By Sudhakar Ravula
  • నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా..
  • చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తా..
  • రౌడీలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
  • మాచర్లలో రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు..
CM Chandrababu: నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలకు అదే గతి..! సీఎం సీరియస్‌ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మాచర్లలో టీడీపీ జెండా ఎగరేశారు జూలకంటి బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు అని గుర్తుచేశారు.. మాచర్లకు వచ్చిన నాకు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది.. ఇది నిలబెట్టాల్సిన బాధ్యత మీదే అని సూచించారు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా… మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్ అని గుర్తుచేశారు.

Read Also: Bolarum Railway Staion : హైదరాబాద్ బోలారం స్టేషన్‌లో పట్టాలపై నడుస్తున్న ముగ్గురిని ఢీకొన్న రైలు

నేను 1995 ముఖ్యమంత్రిని.. స్వర్ణాంధ్ర-స్వఛ్చాంధ్ర కార్యక్రమానికి వచ్చా. మనసులో చెత్త ఉండే మనుషులను కూడా తీసెయ్యాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం చెత్తను రోడ్లపై వేశారు… చెత్తపై పన్ను వేశారు. నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నాయకులను కూడా అలాగే చేస్తాను అని హెచ్చరించారు.. మాచర్లలో రికార్డు మెజారిటీ ఇచ్చారు. చంద్రయ్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. ప్రాణాలు లెక్కచెయ్యకుండా జై తెలుగుదేశం అన్నారు. జల్లయ్యను కిరాతకంగా చంపారు. నంబూరు శేషగిరిరావు వీరోచితంగా పోరాడారు. కానీ, ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు అని స్పష్టం చేశారు.. నాలాంటి నాయకుడే మాచర్ల రసలేకపోయారంటే చిన్న నాయకుల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు చంద్రబాబు..

ఇక, త్వరలో సంజీవని కార్యక్రమం తీసుకొస్తా.. అందరికీ రెండున్నర లక్షల ఇన్సూరెన్స్, పేదలకు 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి తీసుకొస్తా అన్నారు సీఎం చంద్రబాబు.. మీ ఇంటి వద్దే మీ ఇంటికి వైద్యం అందేలా చేస్తా.. బిల్ గేట్స్ సాంకేతిక సాయం చేసేందుకు అంగీకరించారు. 2047కల్లా 50శాతం పచ్చదనం రాష్ట్రంలో ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.. పల్నాడుపై నాకు ఎనలేని అభిమానం.. పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువగా ఉంది.. మాచర్లలో మరింత తక్కువగా ఉంది. మాచర్లకు ప్రత్యేకంగా నిధులు ఇస్తాం. జల్ జీవన్ మిషన్ ద్వారా మాచర్ల గురజాల నియోజకవర్గాలలో ఇంటింటికీ నీరు ఇచ్చే బాధ్యత నాది. వరికపూడిసెల పల్నాడు జీవనాడి.. అరవై ఏళ్ల చిరకాల స్వప్నం.. వరికపూడిసెల పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వరికపూడిసెల ద్వారా లక్షా 25వేల ఎకరాలకు నీరందిస్తాం. 2027 కల్లా పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తా.. పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా మాచర్లకు తాగునీరు అందదు.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో అందరికీ సాగు, తాగునీరు అందిస్తాం. ఈ ఏడాది 94 శాతం ప్రాజెక్టులలో జలకళ కనిపిస్తుంది. కేంద్రంతో మాట్లాడి చిల్లీ బోర్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. వ్యవసాయంలో పురుగుమందుల వాడకం తగ్గించండి. యూరియా ఎక్కువగా ఉపయోగిస్తే పంట ఉత్పత్తులతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • macherla
  • palnadu
  • rowdies

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions