Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: రణ్వీర్ సింగ్ కెరీర్లో ఎన్నో విజయాలు వచ్చినా, గత కొన్నేళ్లలో వచ్చిన ‘ధురంధర్’ సిరీస్ అతనిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒకప్పుడు రొమాంటిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఈ నటుడు, ఇప్పుడు భారీ స్పై యాక్షన్ ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ధురంధర్’ సిరీస్ గురించి తాజాగా మరోసారి చర్చ మొదలైంది. దీనికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన వార్షిక లేఖలో జియో స్టూడియోస్ విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించడమే.
ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, షేర్ హోల్డర్లకు రాసిన యాన్యువల్ లెటర్లో ముఖేష్ అంబానీ జియో స్టూడియోస్ సాధించిన అరుదైన ఘనతను ప్రస్తావించారు. 2024లో ‘స్త్రీ 2’, 2025లో ‘ధురంధర్’, 2026లో ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలతో వరుసగా మూడు సంవత్సరాలు అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన ఏకైక నిర్మాణ సంస్థగా జియో స్టూడియోస్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయాలు సంస్థ నాయకత్వానికి, దీర్ఘకాలిక వ్యూహాలకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
Also Read
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
- Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
- Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
ప్రత్యేకంగా ‘ధురంధర్’ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని చెప్పుకొచ్చారు. ఇక మొదటి భాగం భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవగా, రెండో భాగం విడుదలయ్యే వరకు అది వరుసగా 15 వారాల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ ఈ సిరీస్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ ఫ్రాంచైజీ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి రణ్వీర్ సింగ్ పాత్రే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా రొమాంటిక్ పాత్రల్లో కనిపించే రణ్వీర్, ఈ సినిమాలో పూర్తి భిన్నమైన రఫ్ అండ్ రా స్పై పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలను సమతుల్యంగా మేళవించడం కూడా ఈ సినిమాల విజయానికి బలమైన కారణంగా మారింది.
బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే, ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ గణాంకాల ప్రకారం ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1,812.96 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జియో స్టూడియోస్ అమలు చేసిన అగ్రెసివ్ మార్కెటింగ్ వ్యూహాలు, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన విధానం కూడా ఈ విజయానికి కీలకంగా నిలిచాయి.
ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ భారతదేశంలో జూన్ 4 రాత్రి 7 గంటల నుంచి జియోహాట్స్టార్లో డిజిటల్ ప్రీమియర్గా అందుబాటులోకి రానుంది. జూన్ 5 నుంచి రెగ్యులర్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత మంది ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!