Nitin Gadkari: వాయు కాలుష్యం ప్రధాన సమస్య.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్య అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ… ఐదు లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదార్లను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.. 2024 నాటికి ఏపీలో ఐదు లక్షల కోట్ల హైవే ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కానున్నాయని వెల్లడించారు.. ఇక, ఏపీకి రానున్న మూడు నెలల్లో మరో 3 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు. షిప్పింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ముఖ్యమైన రాష్ట్రంగా పేర్కొన్నారు గడ్కరీ.. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే లాజిస్టిక్ పార్క్ మంజూరు చేస్తామన్న ఆయన.. భువనేశ్వర్ నుంచి విశాఖ భోగాపురం వరకూ ఆరు లైన్ల హైవే, విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు చేస్తామన్నారు.. రాజమండ్రి – కాకినాడ కెనాల్ రోడ్ ను మంజూరు చేస్తామన్నారు.. ఇక, ఇప్పుడు వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే అని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
Read Also: NTR: జూనియర్ యన్టీఆర్ ట్వీట్ పై విమర్శలు!
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
ఇక, రాజమండ్రిలో పర్యటించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. జాతీయ రహదారి నంబర్ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించారు. వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ హైవేపై 4 లేనింగ్, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!