YS Jagan Attack Case: వైఎస్ జగన్పై దాడి కేసులో కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు.. బాధితుడిని విచారించరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Attack Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విపక్షనేతగా ఉన్న సమయంలో.. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయనపై కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు.. ఇదే సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసుకు బెయిల్ నిరాకరించిన ఎన్ఐఏ కోర్టు… కేసులో బాధితుడి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఎన్ఐఏ న్యాయవాది కోర్టుకు తెలపడంతో.. అసలు రికార్డు చేస్తే చార్జిషీట్లో ఎందుకు లేదని ప్రశ్నించారు న్యాయమూర్తి.. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందన్న కోర్టు.. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు షెడ్యూల్ ప్రకటించింది.. కోర్టుకు బాధితుడు సహా మిగిలినవారంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి.
Read Also: Vellampalli Srinivas: పవన్ కల్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది.. పార్టీ మూసుకోండి..
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఇక, ఈ కేసులో శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ను రద్దు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.. కాగా, విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై కోడికత్తితో శ్రీనివాస్ దాడి చేశారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం శ్రీనివాస్ రిమాండ్లో ఉన్నారు. అయితే, బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు.. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎందుకు విచారించడంలేదు.. ఆయన్ను విచారించకుండా.. ఈ కేసులో సాక్షులను విచారిస్తే ఉపయోగం ఏముందని ప్రశ్నించింది.. ఇదే సమయంలో స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దాంతో న్యాయస్థానం కలుగజేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేస్తే ఛార్జిషీట్లో ఎందుకు పేర్కొలేదని ప్రశ్నించడంతో ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్టు అయ్యింది. ఇక, తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీన జరగనుండడంతో.. ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!