Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Nda Alliance Mlc Candidates File Nominations In Ap Somireddy Chandra Mohan Reddy

Somireddy: మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..

Published Date :March 10, 2025 , 4:25 pm
By Chandra Shekhar Pamena
  • ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు..
  • మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..
  • వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నావారు: సోమిరెడ్డి
Somireddy: మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Somireddy: ఎన్డీయే కూటమి అభ్యర్థులుగా బీదా రవి చంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బీదా రవి చంద్ర జిల్లా పార్టీ అధ్యక్షులుగా పని చేశారు.. బీదా మస్తాన్ రావు కూడా రాజ్యసభ సభ్యుడిగా చేశారు.. ఒక కార్యకర్తగా అద్భుతంగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి బీదా రవిచంద్ర.. మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్ కి వస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. తప్పకుండా ఇన్ని రోజులుగా కౌన్సిల్లో మిడిసిపడిన వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీలు మంచి కౌంటర్ ఇస్తారు అని చెప్పారు. అన్ని వర్గాలకు ఎమ్మెల్సీలు ద్వారా న్యాయం చేశామని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Read Also: CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు

Also Read

  • CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
  • CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Add as a preferred
source on google

ఇక, శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీదా రవిచంద్ర. సాధారణ కార్యకర్తగా మండల నాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది.. వివిధ స్థానాల్లో పని చేసే అవకాశం టీడీపీ న్యాయకత్వం కల్పించింది.. శాసన మండలికి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది.. తెలుగు దేశం పార్టీ ఎప్పుడు బడుగు బలహీనర్గాలకు అవకాశాలు ఎప్పుడు కల్పిస్తూనే ఉంటారు.. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన నాకు మంచి అవకాశం కల్పించారు.. రాయలసీమ నుంచి అత్యధిక సీట్లు రావాలని అందరం కష్ట పడ్డాము.. జోన్ 5 కో ఆర్డినేటర్ గా పని చెయ్యడం మంచి అనుభూతి ఇచ్చింది అని బీదా రవిచంద్రా తెలిపారు.

Read Also: CM Yogi: యూపీ రైతులకు సీఎం శుభవార్త.. గోధుమ మద్దతు ధర పెంపు

అలాగే, చంద్రబాబు, నారా లోకేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కావలి గ్రీష్మ తెలిపారు. నిండు గర్భిణి అయినటువంటి నాకు ఇలాంటి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను.. దళిత జాతిని అవమానించే విధంగా వైసీపీ ప్రవర్తిస్తుంది.. వైసీపీలో ఇంకా మార్పు రాలేదు అని మండిపడింది. వైసీపీలో దళితులను భ్రష్టు పెట్టే విధానం అలాగే ఉంది.. డిబెట్ లో మాట్లాడిన సమయంలో నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడిగారు.. నేను కనీసం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు ఫైల్ చెయ్యలేదు అని పేర్కొనింది. అలాంటి సమయంలోనే బస్ లో నుంచి ఈడ్చి తంతాను అని వ్యాఖ్యానించాను.. దళితులను ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. అందుకే వారికి 11 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక, బీటీ నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సిఎం చంద్రబాబు, లోకేష్ కి ధన్యవాదాలు.. మాకు గాడ్ ఫాదర్లు లేరు.. డబ్బులు లేవు అని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • chandrababu
  • janasena
  • MLC ELECTIONS

తాజావార్తలు

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

  • DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..

  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..

  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions