Somireddy: మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..
- ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు..
- మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..
- వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నావారు: సోమిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy: ఎన్డీయే కూటమి అభ్యర్థులుగా బీదా రవి చంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బీదా రవి చంద్ర జిల్లా పార్టీ అధ్యక్షులుగా పని చేశారు.. బీదా మస్తాన్ రావు కూడా రాజ్యసభ సభ్యుడిగా చేశారు.. ఒక కార్యకర్తగా అద్భుతంగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి బీదా రవిచంద్ర.. మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్ కి వస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. తప్పకుండా ఇన్ని రోజులుగా కౌన్సిల్లో మిడిసిపడిన వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీలు మంచి కౌంటర్ ఇస్తారు అని చెప్పారు. అన్ని వర్గాలకు ఎమ్మెల్సీలు ద్వారా న్యాయం చేశామని సోమిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు
Also Read
ఇక, శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీదా రవిచంద్ర. సాధారణ కార్యకర్తగా మండల నాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది.. వివిధ స్థానాల్లో పని చేసే అవకాశం టీడీపీ న్యాయకత్వం కల్పించింది.. శాసన మండలికి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది.. తెలుగు దేశం పార్టీ ఎప్పుడు బడుగు బలహీనర్గాలకు అవకాశాలు ఎప్పుడు కల్పిస్తూనే ఉంటారు.. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన నాకు మంచి అవకాశం కల్పించారు.. రాయలసీమ నుంచి అత్యధిక సీట్లు రావాలని అందరం కష్ట పడ్డాము.. జోన్ 5 కో ఆర్డినేటర్ గా పని చెయ్యడం మంచి అనుభూతి ఇచ్చింది అని బీదా రవిచంద్రా తెలిపారు.
Read Also: CM Yogi: యూపీ రైతులకు సీఎం శుభవార్త.. గోధుమ మద్దతు ధర పెంపు
అలాగే, చంద్రబాబు, నారా లోకేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కావలి గ్రీష్మ తెలిపారు. నిండు గర్భిణి అయినటువంటి నాకు ఇలాంటి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను.. దళిత జాతిని అవమానించే విధంగా వైసీపీ ప్రవర్తిస్తుంది.. వైసీపీలో ఇంకా మార్పు రాలేదు అని మండిపడింది. వైసీపీలో దళితులను భ్రష్టు పెట్టే విధానం అలాగే ఉంది.. డిబెట్ లో మాట్లాడిన సమయంలో నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడిగారు.. నేను కనీసం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు ఫైల్ చెయ్యలేదు అని పేర్కొనింది. అలాంటి సమయంలోనే బస్ లో నుంచి ఈడ్చి తంతాను అని వ్యాఖ్యానించాను.. దళితులను ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. అందుకే వారికి 11 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక, బీటీ నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సిఎం చంద్రబాబు, లోకేష్ కి ధన్యవాదాలు.. మాకు గాడ్ ఫాదర్లు లేరు.. డబ్బులు లేవు అని తెలిపారు.
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..