CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు
- చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు
- జగన్ను ప్రగతిభవన్కు పిలిచి రాయలసీమ లిఫ్ట్కి అనుమతిచ్చింది కేసీఆర్ కాదా.?
- కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదు
- కట్టుడు.. కూల్చుడు అయ్యింది
- కేసీఆర్ కుటుంబానికి అంత బరితెగింపు ఎందుకో..? : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ను ఓడించి, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిందీ తానేనని రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్తిగా ఓటమి దక్కిందంటే, దానికి కారణం తానేనని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. “స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?” అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన అక్కసుతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాక, కేసీఆర్ అసెంబ్లీలో వర్చస్సు చూపే స్థాయిలో లేరని వ్యాఖ్యానించారు.
కేటీఆర్కు ఎలాంటి భయం లేదన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్, “క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు. భయపడితే క్రైమ్ చేయరు. అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గురించి మాట్లాడటమే అనవసరమని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్, “కిషన్ రెడ్డి నేనే మెట్రో తెచ్చానంటున్నారు. అసలు కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తెచ్చే ఉంటే, తానే స్వయంగా సన్మానిస్తానని సీఎం స్పష్టం చేశారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
“కనీసం అఖిలపక్ష సమావేశానికి కూడా కిషన్ రెడ్డి రాలేదు. కేంద్రం నుంచి నిధులు తెస్తే తాము తిరస్కరించమా? రింగ్ రోడ్డు అంటే పూర్తి వలయాకారంలో ఉండాలి. కానీ సగం ఇచ్చి దాన్ని రింగ్ రోడ్డంటూ ఎలా అంటారని?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినా, బీజేపీ నేతలు హాజరుకాలేదని దుయ్యబట్టారు. కేసీఆర్పై భయంతోనే కిషన్ రెడ్డి సమావేశానికి రాలేదేమోనని ఎద్దేవా చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడంలో బీజేపీ వైఫల్యం చెందిందని ఆరోపించిన సీఎం రేవంత్, “బుల్లెట్ ట్రైన్ గుజరాత్కు ఇచ్చారు. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?” అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ చెల్లించే పన్నులతో పోల్చితే, కేంద్రం నుంచి రాబడే నిధులు ఎంత తక్కువగా ఉన్నాయో ప్రజలకు అర్థమయ్యేలా చర్చకు రావాలని సవాల్ విసిరారు. “కిషన్ రెడ్డికి ధైర్యముంటే ఈ అంశంపై చర్చకు రావాలి. నేను సీఎం భట్టి విక్రమార్క్తో సహా చర్చకు సిద్ధమే” అని ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్లేందుకు తాను వెనుకాడనని స్పష్టం చేశారు. “ఢిల్లీ వెళ్లడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన అనుమతులు రావడానికి సహాయపడింది” అని రేవంత్ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీకి కూడా దిగకుండా తప్పించుకున్నది బీఆర్ఎస్ కాదా?” అని రేవంత్ ప్రశ్నించారు. హరీశ్ రావు లాంటి నేతలు రాజకీయంగా తప్పించుకునేందుకు దొంగ దెబ్బ తీశారని విమర్శించారు. మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను బీజేపీ వ్యాఖ్యలతో పోల్చుతూ, రెండు ఒకటేనని కొట్టిపడేశారు. ఏపీలో వర్గీకరణ సమస్యపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదని తిప్పికొట్టారు. SLBC ప్రాజెక్టును గతంలోనే పూర్తి చేసి ఉంటే, కొండపల్లి ఘటనలో ప్రాణనష్టం జరిగేది కాదని రేవంత్ అన్నారు. అంతేకాకుండా, ప్రజల మరణాలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆయన ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో