Sankranti Festival: మూడేళ్ల తర్వాత నారావారిపల్లెకి నారా, నందమూరి కుటుంబాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Festival: ఈ సంక్రాంతికి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని నారా, నందమూరి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా స్వగ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె వెళ్లాలని చంద్రబాబు కుటుంబం డిసైడ్ అయ్యింది. తన బావ కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఆస్వాదించనుంది. ఈ మేరకు బాలయ్య తన భార్య వసుంధరతో పాటు నారావారిపల్లె వెళ్లనున్నాడు. లోకేష్, బ్రాహ్మణి దంపతులు, వారి కుమారుడు దేవాన్ష్ కూడా సంక్రాంతి సంబరాల్లొ పాల్గొననున్నారు.
Read Also: Nellore District: కలకలం రేపుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి వివాదం
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
మూడేళ్ళ తరువాత సంక్రాంతికి నారావారిపల్లెకి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల రాక సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అటు ఈనెల 12న బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ విడుదల అవుతుండటంతో ఈ సందడి రెట్టింపు కానుంది. 12న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నారా దేవాన్ష్ లు నారావారిపల్లెకు చేరుకుంటారు. 13న చంద్రబాబు, నారా లోకేశ్, బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు వెళ్తారు. 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ తిరుగుపయనమవుతారు. 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్కు పయనమవుతారు.
కాగా చివరిసారిగా 2019లో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చంద్రబాబు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఊరి జనంతో రెండు కుటుంబాలు కలిసిపోయాయి. సంక్రాంతి పిండి వంటలతో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మరింతగా జోష్ పెంచేలా టీడీపీ నేతలు, బంధువులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!