Online Betting: రెండు ప్రాణాలు తీసిన బెట్టింగ్.. కొడుకు కోట్లలో అప్పు.. తల్లిదండ్రుల ఆత్మహత్య..
- ఆన్ లైన్ బెట్టింగ్ లో కోట్ల రూపాయలు అప్పు చేసిన కొడుకు..
- భూమి అమ్మి కొన్ని అప్పులు తీర్చిన తల్లిదండ్రులు..
- అప్పుల తీరకపోవడంతో అవమానభారంతో దంపతుల ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Betting: కష్టం లేకుండా.. కదలకుండా డబ్బు వచ్చేస్తుందన్న దురాశ.. కొందరి జీవితాల్లో తీరని దుఃఖాన్ని మిగిలిస్తోంది.. “కాయ్ రాజా కాయ్” అంటూ ఒకప్పుడు తిరునాళ్లల్లో కనిపించిన పందేలు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ వేదికగా జడలు విప్పాయి. మొబైల్ యాప్ లలో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.. వెనక్కి మళ్లీ చూస్తే ఏమీలేదు.. కన్నవారు.. కట్టుకున్నవారు కూడా దూరమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా నంద్యాలలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.. అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also: Google Pixel Buds Pro 2: గూగుల్ పిక్సెల్ నుంచి బడ్స్, వాచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మహేశ్వర్ రెడ్డి(48), ప్రశాంతి(35) అనే దంపతులు అప్పుల బాధ తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు రూ.2.5 కోట్లు దాకా అప్పు చేశారు. సదరు దంపతులకు నిఖిల్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. యువరైతు మహేశ్వర్ రెడ్డి అప్పులు అధికం కావడంతో ఒత్తిళ్లు తట్టుకోలేక గత కొంత కాలంగా వెలుగోడులోని తన మామ వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. అయితే, అప్పులు తీర్చడం కష్టసాధ్యమని భావించిన మహేశ్వర్ రెడ్డి తన భార్య ప్రశాంతితో కలిసి వెలుగోడులో సమీప పొలాల్లో కూల్ డ్రింక్ లో పురుగు మందు కలుపుకొని సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ లక్మీనారాయణ, వెలుగోడు ఎస్.ఐ గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి మామ వెంకటేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ దంపతుల ఆత్మహత్యకు కొడుకు చేసిన అప్పులే కారణంగా చెబుతున్నారు.. ఆన్లైన్ జూదానికి అలవాటుపడిన కొడుకు.. కోట్లలో అప్పులు చేయడంతో.. పరువు కోసం పొలాలు అమ్మి కొంత మేర అప్పుతీర్చిన ఆ దంపతులు.. మరిన్ని అప్పులు తీర్చడం తమ వల్ల కాదనే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!