Sankranti Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
- శ్రీశైలంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
- ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణ..
- శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం..
- సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Brahmotsavam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.. రేపటి నుండి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు ఉంటాయి.. ఈ నేపథ్యంలో నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు రుద్ర, చండీ, మృత్యుంజయ హోమాలు నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీస్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత, ప్రదోషకాల, ప్రాతకాల, ఉదయస్తామాన సేవలు నిలుపుదల చేసినట్టు దేవస్థానం వెల్లడించింది..
Read Also: Bollywood : బాలీవుడ్లో క్యూరియస్ కలిగిస్తున్న న్యూ పెయిర్స్
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
మరోవైపు.. శ్రీశైలం మల్లన్న ఆలయంలో పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పుష్పార్చన నిర్వహించారు.. పుష్పకైంకర్యమంలో సుమారు 40 రకాల పుష్పలు, బిల్వం, దవనం, మరువం వంటి పత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లకు ఆర్చకస్వాములు విశేషంగా పూజాదికాలు జరిపించారు. ఈ పుష్పార్చనలో 4వేల కేజీల పుష్పాలు మొత్తం 40 రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరుపగా పుష్పార్చనలో అర్చక, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించి సంకల్పంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపారు. ఈ పుష్పార్చన సందర్భంగా వేదపారాయణలు జరిపేందుకు దేవస్థానం వేదపండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి మరో 15 మంది వేదపండితులతో పారాయణలను నిర్వహించగా పుష్పకైంకర్యానికి పుష్పాలంకృత వేదికను పుష్పాలన్నింటిని ఏపీ రాష్ట్ర బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు పుంగనూరు రామచంద్ర యాదవ్ దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ పుష్పార్చనలో పుష్పాల విరాళం దాత రామచంద్ర యాదవ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
-
Rohit Sharma: వయసు పెరిగినా జోరు తగ్గలేదు.. రికార్డుల పుస్తకాల్లోకి మరోసారి ‘హిట్ మ్యాన్’..
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!