Sankranti Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
- శ్రీశైలంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
- ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణ..
- శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం..
- సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Brahmotsavam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.. రేపటి నుండి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు ఉంటాయి.. ఈ నేపథ్యంలో నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు రుద్ర, చండీ, మృత్యుంజయ హోమాలు నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీస్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత, ప్రదోషకాల, ప్రాతకాల, ఉదయస్తామాన సేవలు నిలుపుదల చేసినట్టు దేవస్థానం వెల్లడించింది..
Read Also: Bollywood : బాలీవుడ్లో క్యూరియస్ కలిగిస్తున్న న్యూ పెయిర్స్
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
మరోవైపు.. శ్రీశైలం మల్లన్న ఆలయంలో పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పుష్పార్చన నిర్వహించారు.. పుష్పకైంకర్యమంలో సుమారు 40 రకాల పుష్పలు, బిల్వం, దవనం, మరువం వంటి పత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లకు ఆర్చకస్వాములు విశేషంగా పూజాదికాలు జరిపించారు. ఈ పుష్పార్చనలో 4వేల కేజీల పుష్పాలు మొత్తం 40 రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరుపగా పుష్పార్చనలో అర్చక, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించి సంకల్పంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపారు. ఈ పుష్పార్చన సందర్భంగా వేదపారాయణలు జరిపేందుకు దేవస్థానం వేదపండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి మరో 15 మంది వేదపండితులతో పారాయణలను నిర్వహించగా పుష్పకైంకర్యానికి పుష్పాలంకృత వేదికను పుష్పాలన్నింటిని ఏపీ రాష్ట్ర బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు పుంగనూరు రామచంద్ర యాదవ్ దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ పుష్పార్చనలో పుష్పాల విరాళం దాత రామచంద్ర యాదవ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!