Sankranti Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
- శ్రీశైలంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
- ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణ..
- శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం..
- సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం..
Sankranti Brahmotsavam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.. రేపటి నుండి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు ఉంటాయి.. ఈ నేపథ్యంలో నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు రుద్ర, చండీ, మృత్యుంజయ హోమాలు నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీస్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత, ప్రదోషకాల, ప్రాతకాల, ఉదయస్తామాన సేవలు నిలుపుదల చేసినట్టు దేవస్థానం వెల్లడించింది..
Read Also: Bollywood : బాలీవుడ్లో క్యూరియస్ కలిగిస్తున్న న్యూ పెయిర్స్
Also Read
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
- Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
మరోవైపు.. శ్రీశైలం మల్లన్న ఆలయంలో పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పుష్పార్చన నిర్వహించారు.. పుష్పకైంకర్యమంలో సుమారు 40 రకాల పుష్పలు, బిల్వం, దవనం, మరువం వంటి పత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లకు ఆర్చకస్వాములు విశేషంగా పూజాదికాలు జరిపించారు. ఈ పుష్పార్చనలో 4వేల కేజీల పుష్పాలు మొత్తం 40 రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరుపగా పుష్పార్చనలో అర్చక, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించి సంకల్పంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపారు. ఈ పుష్పార్చన సందర్భంగా వేదపారాయణలు జరిపేందుకు దేవస్థానం వేదపండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి మరో 15 మంది వేదపండితులతో పారాయణలను నిర్వహించగా పుష్పకైంకర్యానికి పుష్పాలంకృత వేదికను పుష్పాలన్నింటిని ఏపీ రాష్ట్ర బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు పుంగనూరు రామచంద్ర యాదవ్ దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ పుష్పార్చనలో పుష్పాల విరాళం దాత రామచంద్ర యాదవ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!