Makara Sankranti Brahmotsavam: శ్రీశైలంలో రేపటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
- రేపటితో శ్రీశైలంలో ముగియనున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
- నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
Makara Sankranti Brahmotsavam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి.. బుధవారం ఐదోవరోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి రావణవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణవాహనాదీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు..
Read Also: CM Revanth Reddy: తెలంగాణకు నీటి కేటాయింపులు విషయంలో బలమైన వాదనలు వినిపించాలి..
Also Read
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
ఇక, రేపటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నారు.. నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.. యాగశాలలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం నిర్వహించనున్నారు.. సాయంత్రం సద్యసం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికిన ధ్వజపటం ధ్వజవరోహణ నిర్వహిస్తారు.. కాగా, శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. మరోవైపు, శ్రీశైలం ఆలయంలో జరిగే పూజలపై అర్చకులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు మోమో ఇచ్చారు.. ఆలయంలో నిత్యపూజ కైంకర్యాలు, ఉత్సవాలలో ఏర్పాట్లపై వివరణ కోరుతూ వైదిక సిబ్బందికి మెమో ఈవో శ్రీనివాసరావు మోమో ఇచ్చారు. ఇటీవల జరిగిన అరుద్రోత్సవం రోజున ఆలయంలో ఏకాంత జరిగే పూజలలో హారతికి ఈవోను అంతరాలయం నుండి హారతి దర్శనానికి అర్చకులు అనుమతించకపోవడంతో ఆలయంలో జరిగే పూజలపై వివరణ కోరారు. దీనిపై అర్చకులు ఈవోను కలసి వివరంగా చెప్పారు. ఎంకాంత జరిగే సేవలలో అర్చకులు తప్ప ఎవరూ రాకూడదని ఏకాంత పూజలకు అర్చకులు మినహా ఇతరులు వెళ్లడం మంచిది కాదని ఈవోకు అర్చకులు తెలియజేసారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
-
IPL CheerLeaders Salary: గ్లామర్తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
-
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!