Fake Ornaments: వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాలు.. అసలు నగలు మాయం..!
- మద్దూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాలు..
- 5.83 కిలోల అసలు వెండి నగలు మాయం..
- వెండి నగల విలువ అంచనా రూ.14 లక్షలు..
- వైకుంఠ ఏకాదశి రోజున బయటపడిన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Ornaments: వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాల వ్యవహారం కలకలం సృష్టించింది.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం (సోమవారం) రోజున స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా, అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించడంతో ఈ బాగోతం బయటపడింది. ఆలయానికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మరికొన్ని వెండి ఆభరణాలు మొత్తం 5.83 కిలోలు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆలయ ఈవో సాయి జయచంద్ర రెడ్డి వెంటనే ఆలయానికి చేరుకుని నగలను పరిశీలించారు. గత ఈవో తనకు చార్జ్ అప్పగించలేదని, అందుకే ఆభరణాల లెక్కలు సక్రమంగా అందలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఈవో తెలిపారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో అలంకరణ చేయడం ఆనవాయితీ. దర్శనం పూర్తైన తరువాత నగలను ఆలయంలోని బీరువాలో భద్రపరిచే బాధ్యతను ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ నిర్వహిస్తున్నారు.
అయితే, ఆలయంలోని వెండి నగలు మాయమవడం వెనుక రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు కిషోర్ శర్మ పాత్ర ఉన్నట్లు వ్యాపార, భక్త వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డి పేరూ చర్చలోకి రావడంతో పోలీసులు ఆయన్ను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు మామిడి కిషోర్ శర్మ, ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఆలయ నగల భద్రతలో భారీ లోపాలు ఉన్నాయా? అసలు నగలు ఎక్కడికి వెళ్లాయి? నకిలీ నగలు ఎవరు తెచ్చారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆలయ ఆభరణాల వ్యవహారం అత్యంత సున్నితమైనది కావడంతో, ఆధారాలు లేకుండా ఎవ్వరినీ దోషులుగా నిర్ధారించలేమని పోలీసులు చెబుతున్నారు. విచారణ పూర్తైన తరువాతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!