Fake Ornaments: వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాలు.. అసలు నగలు మాయం..!
- మద్దూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాలు..
- 5.83 కిలోల అసలు వెండి నగలు మాయం..
- వెండి నగల విలువ అంచనా రూ.14 లక్షలు..
- వైకుంఠ ఏకాదశి రోజున బయటపడిన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Ornaments: వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాల వ్యవహారం కలకలం సృష్టించింది.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం (సోమవారం) రోజున స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా, అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించడంతో ఈ బాగోతం బయటపడింది. ఆలయానికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మరికొన్ని వెండి ఆభరణాలు మొత్తం 5.83 కిలోలు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆలయ ఈవో సాయి జయచంద్ర రెడ్డి వెంటనే ఆలయానికి చేరుకుని నగలను పరిశీలించారు. గత ఈవో తనకు చార్జ్ అప్పగించలేదని, అందుకే ఆభరణాల లెక్కలు సక్రమంగా అందలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఈవో తెలిపారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో అలంకరణ చేయడం ఆనవాయితీ. దర్శనం పూర్తైన తరువాత నగలను ఆలయంలోని బీరువాలో భద్రపరిచే బాధ్యతను ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ నిర్వహిస్తున్నారు.
అయితే, ఆలయంలోని వెండి నగలు మాయమవడం వెనుక రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు కిషోర్ శర్మ పాత్ర ఉన్నట్లు వ్యాపార, భక్త వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డి పేరూ చర్చలోకి రావడంతో పోలీసులు ఆయన్ను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు మామిడి కిషోర్ శర్మ, ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఆలయ నగల భద్రతలో భారీ లోపాలు ఉన్నాయా? అసలు నగలు ఎక్కడికి వెళ్లాయి? నకిలీ నగలు ఎవరు తెచ్చారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆలయ ఆభరణాల వ్యవహారం అత్యంత సున్నితమైనది కావడంతో, ఆధారాలు లేకుండా ఎవ్వరినీ దోషులుగా నిర్ధారించలేమని పోలీసులు చెబుతున్నారు. విచారణ పూర్తైన తరువాతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!