Fake Ornaments: వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాలు.. అసలు నగలు మాయం..!
- మద్దూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాలు..
- 5.83 కిలోల అసలు వెండి నగలు మాయం..
- వెండి నగల విలువ అంచనా రూ.14 లక్షలు..
- వైకుంఠ ఏకాదశి రోజున బయటపడిన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Ornaments: వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాల వ్యవహారం కలకలం సృష్టించింది.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం (సోమవారం) రోజున స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా, అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించడంతో ఈ బాగోతం బయటపడింది. ఆలయానికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మరికొన్ని వెండి ఆభరణాలు మొత్తం 5.83 కిలోలు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆలయ ఈవో సాయి జయచంద్ర రెడ్డి వెంటనే ఆలయానికి చేరుకుని నగలను పరిశీలించారు. గత ఈవో తనకు చార్జ్ అప్పగించలేదని, అందుకే ఆభరణాల లెక్కలు సక్రమంగా అందలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఈవో తెలిపారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో అలంకరణ చేయడం ఆనవాయితీ. దర్శనం పూర్తైన తరువాత నగలను ఆలయంలోని బీరువాలో భద్రపరిచే బాధ్యతను ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ నిర్వహిస్తున్నారు.
అయితే, ఆలయంలోని వెండి నగలు మాయమవడం వెనుక రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు కిషోర్ శర్మ పాత్ర ఉన్నట్లు వ్యాపార, భక్త వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డి పేరూ చర్చలోకి రావడంతో పోలీసులు ఆయన్ను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు మామిడి కిషోర్ శర్మ, ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఆలయ నగల భద్రతలో భారీ లోపాలు ఉన్నాయా? అసలు నగలు ఎక్కడికి వెళ్లాయి? నకిలీ నగలు ఎవరు తెచ్చారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆలయ ఆభరణాల వ్యవహారం అత్యంత సున్నితమైనది కావడంతో, ఆధారాలు లేకుండా ఎవ్వరినీ దోషులుగా నిర్ధారించలేమని పోలీసులు చెబుతున్నారు. విచారణ పూర్తైన తరువాతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
-
Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
-
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
-
Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్కు మళ్లీ సమన్లు..!
-
NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..