Minister Payyavula Keshav: శ్రీశైలం నుంచి నీటి వినియోగంపై తెలంగాణతో సంప్రదింపులు..
- శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణతో సంప్రదింపులు..
- గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఇబ్బంది రాలేదు..
- రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంచునరి హల్ లో డీడీఆర్సీ నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.. శ్రీశైలం జలాశయాలను రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారన్నారు మంత్రి కేశవ్. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని మంత్రి నిమ్మల రామనాయుడును సంప్రదించి ప్రకటన చేశామన్నారు. కానీ, రెండో పంటగా ఆరుతడి పంటలే మంచిదన్నారు మంత్రి కేశవ్.
Read Also: Rishabh Pant Got Injured: గాయపడ్డ రిషబ్ పంత్.. మూడో టెస్టులో ఆడుతాడా?
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని, వేల కోట్లతో బకాయిలు పెట్టిందని ఆరోపించారు మంత్రి పయ్యావుల.. ప్రస్తుతం తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జనార్దన్ రెడ్డి , ఫరూక్, ఎమ్మెల్యేలు గౌరు చరిత , అఖిల ప్రియ , బుడ్డా రాజశేఖర రెడ్డి , జయసూర్య , సూర్యప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య.. ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయి.. నీటి వాటాలపై కూడా చర్చలు జరిగినా.. కొలిక్కిరాని విషయం విదితమే.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద కూడా రెండు రాష్ట్రాల వాదనలు.. పరస్పర ఫిర్యాదులు కూడా వెళ్లాయి.. ఇక, నాగార్జున సాగర్ వద్ద.. పలు మార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే..
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!