Minister Payyavula Keshav: శ్రీశైలం నుంచి నీటి వినియోగంపై తెలంగాణతో సంప్రదింపులు..
- శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణతో సంప్రదింపులు..
- గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఇబ్బంది రాలేదు..
- రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంచునరి హల్ లో డీడీఆర్సీ నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.. శ్రీశైలం జలాశయాలను రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారన్నారు మంత్రి కేశవ్. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని మంత్రి నిమ్మల రామనాయుడును సంప్రదించి ప్రకటన చేశామన్నారు. కానీ, రెండో పంటగా ఆరుతడి పంటలే మంచిదన్నారు మంత్రి కేశవ్.
Read Also: Rishabh Pant Got Injured: గాయపడ్డ రిషబ్ పంత్.. మూడో టెస్టులో ఆడుతాడా?
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని, వేల కోట్లతో బకాయిలు పెట్టిందని ఆరోపించారు మంత్రి పయ్యావుల.. ప్రస్తుతం తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జనార్దన్ రెడ్డి , ఫరూక్, ఎమ్మెల్యేలు గౌరు చరిత , అఖిల ప్రియ , బుడ్డా రాజశేఖర రెడ్డి , జయసూర్య , సూర్యప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య.. ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయి.. నీటి వాటాలపై కూడా చర్చలు జరిగినా.. కొలిక్కిరాని విషయం విదితమే.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద కూడా రెండు రాష్ట్రాల వాదనలు.. పరస్పర ఫిర్యాదులు కూడా వెళ్లాయి.. ఇక, నాగార్జున సాగర్ వద్ద.. పలు మార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే..
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!