Nakka Anandbabu: అడ్డూఅదుపూలేని అక్రమ మైనింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ (illegal Mining) పై వైసీపీ నేతలు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు (Nakka Anandbabu). వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ పై సిగ్గు పడాల్సింది పోయి. నిర్లజ్జగా సమర్దించుకుంటూ మసి పూసి మారేడికాయ చేస్తున్నారు.మూడేళ్ల వైసీపీ బకాసురుల చేతిలో రాష్ట్రంలోని కొండలు, గుట్టలు అన్నీ కరిగిపోతున్నాయి.వైసీపీ మూడేళ్లల్లో చేసిన అభివృద్ది శూన్యం.వైసీపీ ఎజెండా కేవలం దాచుకో.. దోచుకో అనే విధంగా ఉంది.175 నియోజకవర్గాలు ఉంటే.. 150 నియోజకవర్గాల్లో యధేచ్చగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు దోచుకుంటున్నారు.హైకోర్టు చరిత్రాత్మక కొండలను కాపాడుకోవాలని చెప్పినా.. అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చి తప్పు దోవ పట్టిస్తున్నారని ఆపంద్ బాబు విమర్శించారు.
KTR: ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులు
Also Read
వైసీపీ సర్కార్ వల్ల చరిత్రాత్మక విశాఖపట్నం రిషికొండ కనుమరుగైపోయింది.కోర్టులన్నా, ఎన్జీటీలన్నా వైసీపీ సర్కార్కు లెక్కలేదు.మన్యం ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి బాక్సైట్ ద్వారా 15 నుంచి 20 వేల కోట్ల కుంభకోణానికి తెర తీశారు.అక్రమ మైనింగుపై టీడీపీ నిజనిర్దారణ కమిటీ వెళ్లి పరిశీలిస్తే మాపై కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1000కు వస్తే.. ఇప్పుడు దాన్ని రూ. 7 వేలు చేశారు. దీని వల్ల ఇసుక కొనలేక జనం అవస్థలు పడుతున్నారు.
ఇసుక అందుబాటులో లేక 30 లక్షల కుటుంబాలు అర్దాకలితో అలమటిస్తున్నారు.ఇసుక మొత్తం జగనే తినేస్తున్నాడు.ఇసుక తిన్న జగనుకు.. అది ఎలా అరుగుతుందో అర్ధం కావడం లేదు..?శేఖర్రెడ్డి అనే బినామిని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఇసుక రీచులన్నీ అతనికి కట్టబెట్టారు.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నాయకత్వంలో కుప్పంలో కొండలు , గుట్టలు అక్రమంగా తవ్వేశారు.పెద్దిరెడ్డి నియోజకవర్గమే కాకుండా, చిత్తూరు జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో గత కొంత కాలంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతున్నారు.ప్రకాశం జిల్లాలో గ్రానేట్ వ్యాపారాన్ని గంపగుత్తగా వైసీపీ నేతలు లాగేసుకొని వేబిల్స్ లేకుండా రాష్ట్రాలకు రాష్ట్రాలు తరలిస్తున్నారు.కోట్లాది రూపాయల మైనింగ్ డబ్బంతా సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్కు వస్తుంది.రాష్ట్రంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.భవిష్యత్తులో దీని కష్టాలు ప్రజలు అనుభవిస్తారు.గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఇనుప ఖనిజం ఏ విధంగా దోపిడి చేసి జైలుకు వెళ్లారు.నేడు నియోజకవర్గానికి ఒక గాలి జనార్దన్ రెడ్డి తయారయ్యారని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!