Sri Lanka Crisis: బైక్ను దాటేసిన సైకిల్ ధర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొనాలంటే గగనంగా మారిపోయింది.. పెట్రోల్ బంక్కు వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి.. అక్కడి వరకు వెళ్తే దొరుకుతుందన గ్యారంటీ లేదు.. ఇక, బ్లాక్ అయితే.. ఏకంగా రూ.2500కు పెట్రోల్ అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఉన్న ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు రూ.150కి విక్రయిస్తున్నారు. కిలో ఉల్లిని రూ. 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు రూ.220కి అమ్ముతున్నారు.. కిలో క్యారెట్ రూ.490కి విక్రయిస్తుండగా 250 గ్రాముల వెల్లుల్లిని రూ.160కి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.. ఇదే సమయంలో.. పెట్రోల్ కష్టాల నుంచి బయటపడేందుకు సైకిల్ను ఆశ్రయిస్తున్నారు లంక వాసులు.. దీంతో.. సైకిళ్ల ధరలు.. భారత్లో లభ్యమయ్యే అనేక బైక్ ధరలను క్రాస్ చేశాయి.. అంతే కాదు.. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి..
Read Also: KTR: ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులు
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
శ్రీలంకలో సైకిల్ కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది.. డీజిల్, పెట్రోల్ కొరత కారణం సైకిల్ కోసం క్యూ కడుతున్నారు లంకవాసులు.. పెద్దవాళ్ల సైకిళ్లను భారీ డిమాండ్ ఏర్పడింది.. ఏకంగా ఓటిన్నర లక్ష దాటేసింది సైకిల్ ధర.. గతంలో 50 వేలకు సైకిల్ దొరికేది.. కానీ, చమురు కొరత, అధిక ధరలతో లంక వాసులు సైకిళ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో.. వాటి ధరలు రెండింతలు పెరిగాయి.. అయినా.. కొనుగోలు చేద్దామంటే అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం లంకలో చిన్నపిల్లలు సైకిలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు వ్యాపారులు. కాగా, భారత్లో అనేక మోడల్స్ బైక్లో లక్షన్నర లోపే దొరుకుతున్నాయి.. స్పోర్ట్స్ బైక్ల ధర వేరుగా ఉన్నా.. లక్షన్నర లోపే చాలా బైక్లు అందుబాటులో ఉన్నాయి.. శ్రీలంకలో మాత్రం.. ఆ ధరకు సైకిల్ కూడా దొరకని పరిస్థితి. మరోవైపు.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కిరాణా ధరలు పెరగడమే కాదు, ఇంధన కొరత కూడా తీవ్రంగా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యవసర అంబులెన్స్ సేవలు కూడా నిలిపివేయబడింది. అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ద్వీప దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!