Sri Lanka Crisis: బైక్ను దాటేసిన సైకిల్ ధర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొనాలంటే గగనంగా మారిపోయింది.. పెట్రోల్ బంక్కు వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి.. అక్కడి వరకు వెళ్తే దొరుకుతుందన గ్యారంటీ లేదు.. ఇక, బ్లాక్ అయితే.. ఏకంగా రూ.2500కు పెట్రోల్ అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఉన్న ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు రూ.150కి విక్రయిస్తున్నారు. కిలో ఉల్లిని రూ. 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు రూ.220కి అమ్ముతున్నారు.. కిలో క్యారెట్ రూ.490కి విక్రయిస్తుండగా 250 గ్రాముల వెల్లుల్లిని రూ.160కి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.. ఇదే సమయంలో.. పెట్రోల్ కష్టాల నుంచి బయటపడేందుకు సైకిల్ను ఆశ్రయిస్తున్నారు లంక వాసులు.. దీంతో.. సైకిళ్ల ధరలు.. భారత్లో లభ్యమయ్యే అనేక బైక్ ధరలను క్రాస్ చేశాయి.. అంతే కాదు.. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి..
Read Also: KTR: ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులు
Also Read
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
శ్రీలంకలో సైకిల్ కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది.. డీజిల్, పెట్రోల్ కొరత కారణం సైకిల్ కోసం క్యూ కడుతున్నారు లంకవాసులు.. పెద్దవాళ్ల సైకిళ్లను భారీ డిమాండ్ ఏర్పడింది.. ఏకంగా ఓటిన్నర లక్ష దాటేసింది సైకిల్ ధర.. గతంలో 50 వేలకు సైకిల్ దొరికేది.. కానీ, చమురు కొరత, అధిక ధరలతో లంక వాసులు సైకిళ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో.. వాటి ధరలు రెండింతలు పెరిగాయి.. అయినా.. కొనుగోలు చేద్దామంటే అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం లంకలో చిన్నపిల్లలు సైకిలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు వ్యాపారులు. కాగా, భారత్లో అనేక మోడల్స్ బైక్లో లక్షన్నర లోపే దొరుకుతున్నాయి.. స్పోర్ట్స్ బైక్ల ధర వేరుగా ఉన్నా.. లక్షన్నర లోపే చాలా బైక్లు అందుబాటులో ఉన్నాయి.. శ్రీలంకలో మాత్రం.. ఆ ధరకు సైకిల్ కూడా దొరకని పరిస్థితి. మరోవైపు.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కిరాణా ధరలు పెరగడమే కాదు, ఇంధన కొరత కూడా తీవ్రంగా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యవసర అంబులెన్స్ సేవలు కూడా నిలిపివేయబడింది. అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ద్వీప దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?